www.ntodaynews.com
విద్యుత్, నీటి సమస్యను పరిష్కరించిన మున్సిపల్ చైర్పర్సన్
తెలంగాణ
/
నల్గొండ
/
చిట్యాల
నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ 9వ వార్డు పరిధిలో అకాల వర్షం కారణంగా విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. దీంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయి స్థానిక ప్రజలు, రైతులు తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొన్నారు. ఈ విషయం తెలుసుకున్న మున్సిపల్ చైర్పర్సన్ పందిరి గీతా రమేష్, స్థానిక కౌన్సిలర్ ఏర్పుల పరమేష్ తక్షణమే స్పందించారు. ఆదివారం ఈ సమస్యను పరిష్కరించడానికి యుద్ధప్రాతిపదికన నూతన విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేయించి, కరెంట్ మరియు నీటి సమస్యను పరిష్కరించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ కుక్కల మోహన్, బొబ్బల రాంరెడ్డి, నాయకులు దేశపాక రాజేష్, ఆగు వెంకన్న తదితరులు పాల్గొన్నారు.