www.ntodaynews.com
విద్యుత్ షాక్తో ఐదు పాడి గేదెల మృతి
తెలంగాణ
/
ఖమ్మం
తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం మధిర మండలం మాటూరుపేట గ్రామంలో విద్యుత్ షాక్కు గురై ఐదు పాడి గేదెలు మృతి చెందిన ఘటన శనివారం చోటుచేసుకుంది.
మాటూరుపేటకు చెందిన పాడి రైతులు ధనిశెట్టి వెంకటనరసయ్యకు చెందిన రెండు గేదెలు, సామినేని శ్రీనివాసరావుకు చెందిన ఒక గేదె, ముదిగొండ సీతయ్యకు చెందిన ఒక గేదె, ముదిగొండ ఈశ్వరరావుకు చెందిన ఒక పాడి గేదె విద్యుత్ షాక్తో మృతి చెందినట్లు రైతులు తెలిపారు.
మృతి చెందిన ఒక్కో గేదె విలువ సుమారు రూ.1.30 లక్షలు ఉంటుందని, ఒక్కసారిగా ఐదు గేదెలు మృతి చెందడంతో తీవ్ర నష్టం వాటిల్లిందని పాడి రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నష్టపరిహారం అందించి ఆదుకోవాలని వారు కోరారు.