www.ntodaynews.com
విధి నిర్వహణలో నిర్లక్ష్యం.. బీఎల్వో సస్పెన్షన్
ఆంధ్రప్రదేశ్
మార్కాపురం మండలంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమం అమలులో నిర్లక్ష్యం వహించిన ఓ బీఎల్వోపై జిల్లా కలెక్టర్ విజయ సునీత కఠిన చర్యలు తీసుకున్నారు. సోమవారం రాయవరం సచివాలయంలో విధులు నిర్వహిస్తున్న పంచాయతీ కార్యదర్శి, బీఎల్వో శ్రీనివాసులను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
అదే సమయంలో విధి నిర్వహణలో నిర్లక్ష్యం ప్రదర్శించిన మరో ఆరుగురు బీఎల్వోలకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన పనుల్లో అలసత్వం ప్రదర్శించిన అధికారులపై కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమాన్ని నిబంధనల ప్రకారం సమర్థవంతంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.