www.ntodaynews.com
విజయమో.. వీర స్వర్గమో.. ఎన్నికల యుద్ధం తప్పదు
ఆంధ్రప్రదేశ్
విజయమో.. వీర స్వర్గమో.. ఎన్నికల యుద్ధం తప్పదు: మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్
ప్రత్యర్థులు ఎంత మంది వచ్చినా వైసీపీ ఒంటరిగానే ఎన్నికల బరిలోకి దిగుతుందని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పష్టం చేశారు.
“ప్రత్యర్థులు ముగ్గురు వచ్చినా.. 300 మంది వచ్చినా.. వైసీపీ సింగిల్గానే పోటీ చేస్తుంది. కూటమి ఎన్ని వాటాలు వేసుకుంటుందో మాకు సంబంధం లేదు. ప్రజల మద్దతుతో ఎన్నికల యుద్ధాన్ని ఎదుర్కొంటాం” అని పేర్కొన్నారు.
రాష్ట్రంలోని ప్రతి పంచాయతీ, వార్డు, మున్సిపాలిటీ, కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ ఒంటరిగానే పోటీ చేయడం తమ విధానమని తెలిపారు.
“విజయమో.. వీర స్వర్గమో.. ఎన్నికల పోరాటం జరగాల్సిందే. ప్రజా సమస్యలపై పోరాడుతూ ముందుకు సాగుతాం” అని గుడివాడ అమర్నాథ్ అన్నారు.