BREAKING
NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన
www.ntodaynews.com

విజయవాడ నుంచి కాశీకి నేరుగా విమాన సేవలు ప్రారంభం

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
19 Aug, 2026 - 08:01 PM
38 వీక్షణలు

విజయవాడ నుంచి కాశీకి నేరుగా విమాన సేవలు ప్రారంభం

  • గన్నవరం–వారణాసి మధ్య ఇండిగో సర్వీసు.. వారానికి మూడు రోజులు రాకపోకలు

విజయవాడ: కాశీ యాత్రకు వెళ్లే ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు మరింత సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. విజయవాడ గన్నవరం విమానాశ్రయం నుంచి పవిత్ర పుణ్యక్షేత్రం వారణాసికి నేరుగా విమాన సర్వీసు ప్రారంభమైంది. ఇండిగో సంస్థ ప్రారంభించిన ఈ సేవలను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు వర్చువల్‌గా ప్రారంభించారు.

విజయవాడ–వారణాసి మధ్య విమాన సర్వీసులు వారంలో మూడు రోజులు మంగళవారం, గురువారం, శనివారం నడవనున్నాయి. ఇప్పటివరకు ఇతర నగరాల్లో విమానాలు మారాల్సిన ప్రయాణికులకు ఇకపై నేరుగా కాశీ చేరుకునే అవకాశం లభించింది. దీంతో ప్రయాణ సమయం తగ్గడంతో పాటు భక్తులకు మరింత సౌకర్యం కలగనుంది.

ఆధ్యాత్మిక పర్యాటకానికి మరింత ప్రోత్సాహం

విజయవాడ నుంచి కాశీకి నేరుగా విమాన సదుపాయం అందుబాటులోకి రావడం ఆధ్యాత్మిక పర్యాటక అభివృద్ధికి దోహదపడుతుందని అధికారులు తెలిపారు. అమరావతి రాజధాని ప్రాంతంతో పాటు ఉమ్మడి కృష్ణా, గుంటూరు, గోదావరి జిల్లాల ప్రజలకు ఈ సేవలు ఎంతో ఉపయోగపడనున్నాయి.

ప్రాంతీయ విమాన అనుసంధానాన్ని బలోపేతం చేయడంతో పాటు ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలను ప్రధాన విమానాశ్రయాలతో కలపడం కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని మంత్రి రామ్మోహన్‌నాయుడు తెలిపారు. ఈ కొత్త సర్వీసుతో విజయవాడ విమానాశ్రయానికి మరింత ప్రాధాన్యం పెరగనుంది.