www.ntodaynews.com
విజయవాడ: NEET (UG)–2026 రీ-ఎగ్జామ్ ఏర్పాట్లపై కలెక్టర్ ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్
/
ఎన్టీఆర్
విజయవాడ లో ఈ నెల 21న జరగనున్న NEET (UG)–2026 రీ-ఎగ్జామ్ నిర్వహణలో ప్రతి దశలోనూ అప్రమత్తంగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ IAS అధికారులను ఆదేశించారు.
జిల్లాలో ఏర్పాటు చేసిన 31 పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తాగునీరు, విద్యుత్, భద్రత, వైద్య సదుపాయాలు, ట్రాఫిక్ నిర్వహణ వంటి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు.
పరీక్షా నిర్వహణను ఎన్టీఏ మార్గదర్శకాల ప్రకారం కట్టుదిట్టంగా అమలు చేయాలని తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి పరీక్షను విజయవంతం చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.