BREAKING
ప్రభుత్వ పాఠశాల అంటే అమ్మ ఒడిలాంటిది జూన్ 12న పాఠశాలలలో విద్యార్థులతో ప్రతిజ్ఞ పోలవరం గ్రామంలో వీధి కుక్కల బెడదపై చర్యలు తీసుకోవాలి అంబేద్కర్ విగ్రహానికి 46వ వారం జ్ఙానమాల కార్యక్రమం.. అనంతపురంలో ఏసీబీ వలలో మున్సిపల్ అధికారులు 22-A భూ సమస్యల పరిష్కారం!… రైతులకు, ప్రజలకు ఊరట! చెక్కపల్లిలో భూదాన భూములను గుర్తించి పేదలకు పంచాలి ఏలూరు జిల్లాలో అక్రమ PDS మాఫియా కలకలం కన్నుల పండుగగా శ్రీ మహాలింగేశ్వర స్వామి కళ్యాణం రైతుల పక్షాన పోరాడుతా.. మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ప్రభుత్వ పాఠశాల అంటే అమ్మ ఒడిలాంటిది జూన్ 12న పాఠశాలలలో విద్యార్థులతో ప్రతిజ్ఞ పోలవరం గ్రామంలో వీధి కుక్కల బెడదపై చర్యలు తీసుకోవాలి అంబేద్కర్ విగ్రహానికి 46వ వారం జ్ఙానమాల కార్యక్రమం.. అనంతపురంలో ఏసీబీ వలలో మున్సిపల్ అధికారులు 22-A భూ సమస్యల పరిష్కారం!… రైతులకు, ప్రజలకు ఊరట! చెక్కపల్లిలో భూదాన భూములను గుర్తించి పేదలకు పంచాలి ఏలూరు జిల్లాలో అక్రమ PDS మాఫియా కలకలం కన్నుల పండుగగా శ్రీ మహాలింగేశ్వర స్వామి కళ్యాణం రైతుల పక్షాన పోరాడుతా.. మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి
www.ntodaynews.com

విస్సన్నపేట బస్టాండ్ వద్ద పట్టుబడ్డ అత్యాచార యత్నం నిందితుడు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
30 Apr, 2026 - 09:53 PM
145 వీక్షణలు

విస్సన్నపేట బస్టాండ్ వద్ద పట్టుబడ్డ అత్యాచార యత్నం నిందితుడు

చాట్రాయి పోలీస్ స్టేషన్

చాట్రాయి పోలీస్ స్టేషన్ క్రైమ్ నెంబర్ 65/2026 కేసులో పోలీసులు వేగంగా స్పందించి నిందితుడిని అరెస్ట్ చేశారు. ముందస్తు సమాచారం ఆధారంగా ఇంచార్జ్ ఎస్ఐ ఎం చిరంజీవి నేతృత్వంలో పోలీసులు విస్సన్నపేట బస్టాండ్ వద్ద నిఘా ఏర్పాటు చేశారు.

ఈ సమయంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఒక యువకుడు పోలీసులను గమనించి పారిపోవడానికి ప్రయత్నించగా, వెంటనే అతడిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అతను నక్క శ్రీనివాస్ అలియాస్ శ్రీను అని తెలిపాడు.

పోలీసుల దర్యాప్తులో, అతను తన గ్రామానికి చెందిన ఒక మహిళ ఇంట్లోకి చొరబడి ఆమెపై దాడి చేసి అత్యాచారం చేయడానికి యత్నించిన విషయం బయటపడింది. బాధితురాలి అరుపులు విని స్థానికులు అక్కడికి చేరుకోవడంతో నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు.

ఈ ఘటనపై భారత న్యాయ సంహిత (BNS) సెక్షన్లు 329(4), 117(2), 127(2), 74, 64 r/w 62 కింద కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం తదుపరి న్యాయపరమైన చర్యలు కొనసాగుతున్నాయి.

ప్రజల భద్రతే లక్ష్యంగా పనిచేస్తున్నామని పోలీసులు స్పష్టం చేస్తూ, అనుమానాస్పద వ్యక్తులు లేదా సంఘటనలు గమనించిన వెంటనే సమాచారం అందించాలని కోరారు.