BREAKING
thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్ thumb బ్రిక్స్ సదస్సులో మోదీ–జిన్‌పింగ్ భేటీపై ఆసక్తి. thumb కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని అనకాపల్లిలో మెగా క్యాండిల్ ర్యాలీ thumb ఎంపీ మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలలో వె ల్లువెత్తిన అభిమానుల సందడి: thumb మునగపాక మండలం లో గణేష్ ఉత్సవాలకు అనుమతులు తప్పనిసరి thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్ thumb బ్రిక్స్ సదస్సులో మోదీ–జిన్‌పింగ్ భేటీపై ఆసక్తి. thumb కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని అనకాపల్లిలో మెగా క్యాండిల్ ర్యాలీ thumb ఎంపీ మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలలో వె ల్లువెత్తిన అభిమానుల సందడి: thumb మునగపాక మండలం లో గణేష్ ఉత్సవాలకు అనుమతులు తప్పనిసరి
Date of Publish : 27 August 2026, 03:09 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

విస్సన్నపేట: విద్యార్థుల గొంతుకను అణచివేయడం ప్రజాస్వామ్యానికి ముప్పు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
27 Aug, 2026 - 03:09 PM
128 వీక్షణలు

విస్సన్నపేట: విద్యార్థుల గొంతుకను అణచివేయడం ప్రజాస్వామ్యానికి ముప్పు

ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేటలో నిర్వహించిన పత్రికా సమావేశంలో సీపీఐ ఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డి. హరినాథ్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై తీవ్ర విమర్శలు చేశారు.

దేశవ్యాప్తంగా విద్యావ్యవస్థలో నెలకొన్న లోపాలను ప్రశ్నిస్తూ జంతర్ మంతర్ ఉద్యమ స్ఫూర్తి ఆరేళ్ల బాలుడి నుంచి జన జీ వరకు విస్తరించిందని ఆయన అన్నారు. నేహ బోరా వారసులుగా అనేక మంది యువత, విద్యార్థులు ఉద్యమ స్ఫూర్తితో పాలకులను ప్రశ్నించే గొంతుకలుగా మారుతున్నారని పేర్కొన్నారు.

బీహార్‌లో పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల్లో అవకతవకలకు నిరసనగా విద్యార్థులు ఆందోళన చేస్తున్నారని, సమస్యల పరిష్కారం కోసం ముఖ్యమంత్రితో చర్చలకు సిద్ధంగా ఉన్నా ప్రభుత్వం స్పందించకపోవడం దురదృష్టకరమని హరినాథ్ అన్నారు.

విద్యార్థుల ర్యాలీలో తన తల్లితో కలిసి పాల్గొన్న ఒకటో తరగతి చదువుతున్న ఆరేళ్ల ఆదిత్య కుమార్ కూడా విద్యార్థుల సమస్యలను పరిష్కరించేందుకు చర్చలు జరపాలని డిమాండ్ చేశాడని తెలిపారు. విద్యార్థుల సమస్యలను వినేందుకు సిద్ధంగా లేని బీహార్ ముఖ్యమంత్రి సామ్రాజ్ చౌదరి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

ఆందోళన చేస్తున్న విద్యార్థులను బలవంతంగా అరెస్టు చేయడం ద్వారా ఎన్డీఏ పాలనలో ప్రజాస్వామ్య హక్కులు, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు భంగం కలుగుతోందని హరినాథ్ ఆరోపించారు. ఇది పాలకుల బుల్డోజర్ విధానానికి నిదర్శనమని అన్నారు.

విద్యార్థులపై అణచివేత చర్యలను ప్రజాస్వామికవాదులు, ప్రజలు తీవ్రంగా ఖండించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.