BREAKING
యోగాంధ్ర కార్యక్రమాల విజయవంత నిర్వహణకు శ్రీశైలం దేవస్థానం ప్రణాళిక బీటెక్ విద్యార్థి కిడ్నాప్ కలకలం.. చివరకు పల్నాడు జిల్లా నరసరావుపేటలో భారీ చోరీ. హోంమంత్రిపై తప్పుడు వ్యాఖ్యలు చేయడం తగదు: ఆగివున్న లారీని ఢీకొట్టిన మినీ బస్సు .. ఒకరు మృతి, 13 మందికి గాయాలు! మార్కాపురంలో రేషన్ బియ్యం మాఫియాకు భారీ షాక్.. 1922 కేజీల బియ్యం సీజ్! అంగరంగ వైభవంగా జన్మదిన వేడుకలు.... ట్రాక్టర్లకు రేడియం స్టిక్కర్లు.. రహదారి ప్రమాదాల నివారణకు నూజివీడు పోలీసుల ప్రత్యేక చర్య పుంగనూరులో తల్లిపై కుమారుడి కర్రలతో దాడి పల్లె నిద్రలో ప్రజలతో మమేకమైన ఆగిరిపల్లి పోలీసులు యోగాంధ్ర కార్యక్రమాల విజయవంత నిర్వహణకు శ్రీశైలం దేవస్థానం ప్రణాళిక బీటెక్ విద్యార్థి కిడ్నాప్ కలకలం.. చివరకు పల్నాడు జిల్లా నరసరావుపేటలో భారీ చోరీ. హోంమంత్రిపై తప్పుడు వ్యాఖ్యలు చేయడం తగదు: ఆగివున్న లారీని ఢీకొట్టిన మినీ బస్సు .. ఒకరు మృతి, 13 మందికి గాయాలు! మార్కాపురంలో రేషన్ బియ్యం మాఫియాకు భారీ షాక్.. 1922 కేజీల బియ్యం సీజ్! అంగరంగ వైభవంగా జన్మదిన వేడుకలు.... ట్రాక్టర్లకు రేడియం స్టిక్కర్లు.. రహదారి ప్రమాదాల నివారణకు నూజివీడు పోలీసుల ప్రత్యేక చర్య పుంగనూరులో తల్లిపై కుమారుడి కర్రలతో దాడి పల్లె నిద్రలో ప్రజలతో మమేకమైన ఆగిరిపల్లి పోలీసులు
www.ntodaynews.com

విస్సన్నపేటలో డ్వాక్రా నిధుల గోల్మాల్… రూ.50 లక్షలు మాయం

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
20 Mar, 2026 - 07:50 PM
142 వీక్షణలు

విస్సన్నపేటలో డ్వాక్రా నిధుల గోల్మాల్… రూ.50 లక్షలు మాయం

ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేటలో మహిళా మండలి డ్వాక్రా సంఘాల నిధుల దుర్వినియోగం ఘటన సంచలనంగా మారింది. సుమారు రూ.50 లక్షల మేర డబ్బులు అక్రమంగా ఉపసంహరించుకున్నట్లు ఆరోపణలు వెలువడ్డాయి.

వెలుగు కార్యాలయంలో బుక్ కీపర్‌గా పనిచేస్తున్న బత్తుల మౌనిక (వివొ) ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. ఆమెతో పాటు ఏపీఎం రామకృష్ణ, సీసీ సుందరమ్మ, బ్యాంకు అధికారుల మధ్య కుమ్మక్కు ఉన్నట్లు బాధిత మహిళలు ఆరోపిస్తున్నారు.

రెడ్డిగూడెం మండలం ముచ్చనపల్లి గ్రామానికి చెందిన సుమారు 35 డ్వాక్రా సంఘాల ఖాతాల నుంచి సభ్యులకు తెలియకుండా డబ్బులు తీసుకున్నట్లు బయటపడింది. నకిలీ తీర్మానాలు, సంతకాలతో డబ్బులు డ్రా చేసినట్లు సమాచారం. సాధారణంగా చిన్న సంతకం తేడా వచ్చినా డబ్బులు ఇవ్వని బ్యాంకులోనే ఈ స్థాయి లావాదేవీలు జరగడం అనుమానాలకు తావిస్తోంది.

తమ కష్టార్జిత పొదుపు డబ్బులు మాయం కావడంతో మహిళా సంఘాల సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ విస్సన్నపేట ఇండియన్ బ్యాంకు శాఖ ముందు ఆందోళన చేపట్టారు. తమ డబ్బులు వెంటనే తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఈ ఘటనపై రెడ్డిగూడెం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు కాగా, పరారీలో ఉన్న మౌనిక కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ వ్యవహారం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.