BREAKING
తప్పిపోయిన వృద్ధ మహిళను కుటుంబ సభ్యులకు అప్పగించిన పోలీసులు పలమనేరు–బెంగళూరు హైవేపై రోడ్డు ప్రమాదం ఎల్కతుర్తిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం లబ్ధిదారులకు పెన్షన్లు అందచేసిన కమిషనర్ NHAI అధికారులతో కేంద్ర మంత్రి పెమ్మసాని సమీక్ష కశిoకోట RECS పాలిటెక్నిక్ కళశాల టీచర్లు రేలే నిరాహార దీక్ష సెప్టెంబర్ 1.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చరిత్రలో చిరస్మరణీయమైన రోజు కాగిత రామచంద్రపురం గ్రామ ప్రభుత్వ ఉపాధ్యాయుడికి హానరరీ డాక్టర్ ప్రధానం వాహనాలు తనిఖీలు జరిమానా విధింపు 2టౌన్ ఎస్సై గా బాధ్యతలు స్వీకరణ తప్పిపోయిన వృద్ధ మహిళను కుటుంబ సభ్యులకు అప్పగించిన పోలీసులు పలమనేరు–బెంగళూరు హైవేపై రోడ్డు ప్రమాదం ఎల్కతుర్తిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం లబ్ధిదారులకు పెన్షన్లు అందచేసిన కమిషనర్ NHAI అధికారులతో కేంద్ర మంత్రి పెమ్మసాని సమీక్ష కశిoకోట RECS పాలిటెక్నిక్ కళశాల టీచర్లు రేలే నిరాహార దీక్ష సెప్టెంబర్ 1.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చరిత్రలో చిరస్మరణీయమైన రోజు కాగిత రామచంద్రపురం గ్రామ ప్రభుత్వ ఉపాధ్యాయుడికి హానరరీ డాక్టర్ ప్రధానం వాహనాలు తనిఖీలు జరిమానా విధింపు 2టౌన్ ఎస్సై గా బాధ్యతలు స్వీకరణ
Date of Publish : 20 March 2026, 07:50 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

విస్సన్నపేటలో డ్వాక్రా నిధుల గోల్మాల్… రూ.50 లక్షలు మాయం

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
20 Mar, 2026 - 07:50 PM
221 వీక్షణలు

విస్సన్నపేటలో డ్వాక్రా నిధుల గోల్మాల్… రూ.50 లక్షలు మాయం

ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేటలో మహిళా మండలి డ్వాక్రా సంఘాల నిధుల దుర్వినియోగం ఘటన సంచలనంగా మారింది. సుమారు రూ.50 లక్షల మేర డబ్బులు అక్రమంగా ఉపసంహరించుకున్నట్లు ఆరోపణలు వెలువడ్డాయి.

వెలుగు కార్యాలయంలో బుక్ కీపర్‌గా పనిచేస్తున్న బత్తుల మౌనిక (వివొ) ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. ఆమెతో పాటు ఏపీఎం రామకృష్ణ, సీసీ సుందరమ్మ, బ్యాంకు అధికారుల మధ్య కుమ్మక్కు ఉన్నట్లు బాధిత మహిళలు ఆరోపిస్తున్నారు.

రెడ్డిగూడెం మండలం ముచ్చనపల్లి గ్రామానికి చెందిన సుమారు 35 డ్వాక్రా సంఘాల ఖాతాల నుంచి సభ్యులకు తెలియకుండా డబ్బులు తీసుకున్నట్లు బయటపడింది. నకిలీ తీర్మానాలు, సంతకాలతో డబ్బులు డ్రా చేసినట్లు సమాచారం. సాధారణంగా చిన్న సంతకం తేడా వచ్చినా డబ్బులు ఇవ్వని బ్యాంకులోనే ఈ స్థాయి లావాదేవీలు జరగడం అనుమానాలకు తావిస్తోంది.

తమ కష్టార్జిత పొదుపు డబ్బులు మాయం కావడంతో మహిళా సంఘాల సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ విస్సన్నపేట ఇండియన్ బ్యాంకు శాఖ ముందు ఆందోళన చేపట్టారు. తమ డబ్బులు వెంటనే తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఈ ఘటనపై రెడ్డిగూడెం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు కాగా, పరారీలో ఉన్న మౌనిక కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ వ్యవహారం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.