BREAKING
జనగనణ ప్రారంభం - భూమా అఖిలప్రియరెడ్డి MLA ఆళ్లగడ్డ ​గూడెం గ్రామంలో తీవ్ర నీటి ఎద్దడి.. ​మంచిర్యాల పట్టణంలో చలివేంద్రాలను ప్రారంభించిన శ్రీమతి కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు ఏలూరు మెయిన్ రోడ్డు రహదారి నిర్మాణపు పనులు వేగవంతం చేయాలి.... ఆత్మకూరు మున్సిపల్ కమిషనర్‌గా శ్రీమతి ఎస్. బేబి నియామకం నంద్యాల జిల్లా, ఆత్మకూరు మున్సిపాలిటీ నూతన మున్సిపల్ కమిషనర్‌గా శ్రీమతి ఎస్. బేబి మేఘన ఎస్టేట్ బాధితుల తరపున కేంద్ర మంత్రి బండి సంజయ్ గారికి వినతి పత్రం అందజేత. పోలవరంలో మృతుని కుటుంబానికి పదివేల రూపాయలు అందజేత చాట్రాయిలో గౌతు లచ్చన్న వర్ధంతి సందర్భంగా ఘన నివాళి మూడు నెలల రేషన్ పంపిణీ.. క్యూలైన్‌లో గంటల తరబడి తిప్పలు... కరెంటు కోత.. ఉక్కపోత.. జనగనణ ప్రారంభం - భూమా అఖిలప్రియరెడ్డి MLA ఆళ్లగడ్డ ​గూడెం గ్రామంలో తీవ్ర నీటి ఎద్దడి.. ​మంచిర్యాల పట్టణంలో చలివేంద్రాలను ప్రారంభించిన శ్రీమతి కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు ఏలూరు మెయిన్ రోడ్డు రహదారి నిర్మాణపు పనులు వేగవంతం చేయాలి.... ఆత్మకూరు మున్సిపల్ కమిషనర్‌గా శ్రీమతి ఎస్. బేబి నియామకం నంద్యాల జిల్లా, ఆత్మకూరు మున్సిపాలిటీ నూతన మున్సిపల్ కమిషనర్‌గా శ్రీమతి ఎస్. బేబి మేఘన ఎస్టేట్ బాధితుల తరపున కేంద్ర మంత్రి బండి సంజయ్ గారికి వినతి పత్రం అందజేత. పోలవరంలో మృతుని కుటుంబానికి పదివేల రూపాయలు అందజేత చాట్రాయిలో గౌతు లచ్చన్న వర్ధంతి సందర్భంగా ఘన నివాళి మూడు నెలల రేషన్ పంపిణీ.. క్యూలైన్‌లో గంటల తరబడి తిప్పలు... కరెంటు కోత.. ఉక్కపోత..
www.ntodaynews.com

విస్సన్నపేటలో డ్వాక్రా నిధుల గోల్మాల్… రూ.50 లక్షలు మాయం

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
20 Mar, 2026 - 07:50 PM
124 వీక్షణలు

విస్సన్నపేటలో డ్వాక్రా నిధుల గోల్మాల్… రూ.50 లక్షలు మాయం

ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేటలో మహిళా మండలి డ్వాక్రా సంఘాల నిధుల దుర్వినియోగం ఘటన సంచలనంగా మారింది. సుమారు రూ.50 లక్షల మేర డబ్బులు అక్రమంగా ఉపసంహరించుకున్నట్లు ఆరోపణలు వెలువడ్డాయి.

వెలుగు కార్యాలయంలో బుక్ కీపర్‌గా పనిచేస్తున్న బత్తుల మౌనిక (వివొ) ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. ఆమెతో పాటు ఏపీఎం రామకృష్ణ, సీసీ సుందరమ్మ, బ్యాంకు అధికారుల మధ్య కుమ్మక్కు ఉన్నట్లు బాధిత మహిళలు ఆరోపిస్తున్నారు.

రెడ్డిగూడెం మండలం ముచ్చనపల్లి గ్రామానికి చెందిన సుమారు 35 డ్వాక్రా సంఘాల ఖాతాల నుంచి సభ్యులకు తెలియకుండా డబ్బులు తీసుకున్నట్లు బయటపడింది. నకిలీ తీర్మానాలు, సంతకాలతో డబ్బులు డ్రా చేసినట్లు సమాచారం. సాధారణంగా చిన్న సంతకం తేడా వచ్చినా డబ్బులు ఇవ్వని బ్యాంకులోనే ఈ స్థాయి లావాదేవీలు జరగడం అనుమానాలకు తావిస్తోంది.

తమ కష్టార్జిత పొదుపు డబ్బులు మాయం కావడంతో మహిళా సంఘాల సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ విస్సన్నపేట ఇండియన్ బ్యాంకు శాఖ ముందు ఆందోళన చేపట్టారు. తమ డబ్బులు వెంటనే తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఈ ఘటనపై రెడ్డిగూడెం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు కాగా, పరారీలో ఉన్న మౌనిక కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ వ్యవహారం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.