విస్సన్నపేటలో హడావిడి… చంద్రుపట్లలో గిరిజన సంక్షేమ శాఖ సంచాలకుల ఆకస్మిక పర్యటన
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం విస్సన్నపేట మండలం చంద్రుపట్ల గ్రామంలో శనివారం ఉదయం ఒక్కసారిగా అధికారులు పరుగులు పెట్టే పరిస్థితి నెలకొంది. గిరిజన సంక్షేమ శాఖ సంచాలకులు సదా భార్గవి ఆకస్మికంగా తహశీల్దార్ కార్యాలయానికి చేరుకోవడంతో వ్యవస్థ మొత్తం అప్రమత్తమైంది.
పర్యటన సమాచారం ముందే వచ్చిన నేపథ్యంలో కార్యాలయ ప్రాంగణం శుభ్రపరిచి, అధికారులంతా హాజరయ్యారు. క్షణాల్లోనే బోకేలు, స్వాగతాలతో వాతావరణం ఉత్సాహంగా మారింది. తహశీల్దార్ కె. లక్ష్మీ కళ్యాణి, ఎంపిడిఓ చిన్న రాట్నాలు కలిసి పుష్పగుచ్ఛం అందజేసి సాదరంగా ఆహ్వానం పలికారు.
గ్రామంలో గిరిజన సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి పనుల పురోగతిపై వివరాలు తెలుసుకునేందుకు వచ్చిన ఈ పర్యటనతో స్థానికంగా చర్చలు జోరందుకున్నాయి. అధికారులు వెంటనే నివేదికలు సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యారు.