BREAKING
చనుబండలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ మంచిర్యాలలో ఘనంగా మే డే ప్రైవేట్ విద్యాసంస్థల సిబ్బంది హక్కుల కోసం ఐక్యపోరాటం కంటాయపాలెం గ్రామానికి ఆర్థిక సాయం అందిస్తున్న శ్రీశైలం పౌర్ణమి సందర్భంగా శ్రీశైల దేవస్థానం గిరిప్రదక్షిణ కార్యక్రమం నంద్యాల పెన్షన్ పండుగ కార్యక్రమం లో TDP జాతీయ ప్రధాన కార్యదర్శి ఎలిమినేడు ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలుడు పుంగనూరు గూడూరు పల్లి వద్దగల టిడ్కో వాసుల కన్నీటి కథ మే డే శుభాకాంక్షలు..... ​మంచిర్యాలలో ‘దివాకర్ అన్న పెరుగన్నం’ కేంద్రం ప్రారంభం దెందులూరు నియోజకవర్గంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పండుగ.. చనుబండలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ మంచిర్యాలలో ఘనంగా మే డే ప్రైవేట్ విద్యాసంస్థల సిబ్బంది హక్కుల కోసం ఐక్యపోరాటం కంటాయపాలెం గ్రామానికి ఆర్థిక సాయం అందిస్తున్న శ్రీశైలం పౌర్ణమి సందర్భంగా శ్రీశైల దేవస్థానం గిరిప్రదక్షిణ కార్యక్రమం నంద్యాల పెన్షన్ పండుగ కార్యక్రమం లో TDP జాతీయ ప్రధాన కార్యదర్శి ఎలిమినేడు ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలుడు పుంగనూరు గూడూరు పల్లి వద్దగల టిడ్కో వాసుల కన్నీటి కథ మే డే శుభాకాంక్షలు..... ​మంచిర్యాలలో ‘దివాకర్ అన్న పెరుగన్నం’ కేంద్రం ప్రారంభం దెందులూరు నియోజకవర్గంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పండుగ..
www.ntodaynews.com

విస్సన్నపేటలో మేడే సందడి – ఐక్యంగా భారీ ర్యాలీ నిర్వహించిన HMC వర్కర్స్ యూనియన్

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
01 May, 2026 - 12:35 PM
32 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా, విస్సన్నపేటలో మేడే సందర్భంగా హిందూ ముస్లిం క్రిస్టియన్ (HMC) వర్కర్స్ యూనియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ ఘనంగా నిర్వహించారు. “అన్ని కులాలు, అన్ని మతాలు సమానమే” అనే సందేశంతో కార్మికులు ఐక్యంగా పాల్గొని సమాజానికి స్పష్టమైన సందేశం ఇచ్చారు.

బస్టాండ్ సెంటర్ నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకు నిర్వహించిన ఈ ర్యాలీలో పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు. ఐక్యత, సమానత్వం, హక్కుల సాధన నినాదాలతో ప్రాంతం అంతా సందడి నెలకొంది.

మేకల జ్ఞాన రత్నం మాట్లాడుతూ, భారతదేశంలోనే హిందూ, ముస్లిం, క్రిస్టియన్ కలిసి ఒకే యూనియన్‌గా ఏర్పడటం గొప్ప ఉదాహరణ అని పేర్కొన్నారు. ఈ ఐక్యతను అభినందించారు.

బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ నాయకుడు షేక్ బుడే మాట్లాడుతూ, ఇప్పటికీ తమకు స్థిరమైన పనిస్థలం లేక రోడ్లపైనే పని చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు మారినా తమ పరిస్థితుల్లో మార్పు లేదని తెలిపారు. విస్సన్నపేటలో ఆటోనగర్ ఏర్పాటు చేయాలని ఎన్నిసార్లు ప్రజాప్రతినిధులు, అధికారులను కోరినప్పటికీ స్పందన లేకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. వెంటనే ఆటోనగర్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.

కార్మికుల హక్కులు పూర్తిగా అమలు కావాలని, ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి విస్సంపల్లి నాగరాజు, సిపిఎం పార్టీ టౌన్ కార్యదర్శి మేకల జ్ఞాన రత్నం, HMC యూనియన్ అధ్యక్షుడు నూరుద్దీన్, కార్యదర్శి షేక్ హుస్సేన్, సహాయ కార్యదర్శి సిరాజ్ బాబు, వైస్ ప్రెసిడెంట్ రాఘవ, షేక్ బుడే తదితరులు పాల్గొన్నారు.