BREAKING
వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి
www.ntodaynews.com

విస్సన్నపేటలో విద్యార్థులకు సైబర్ భద్రతపై అవగాహన

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
06 Aug, 2026 - 09:13 PM
41 వీక్షణలు

విస్సన్నపేటలో విద్యార్థులకు సైబర్ భద్రతపై అవగాహన

విస్సన్నపేట, ఆగస్టు 6: డిజిటల్ యుగంలో రోజురోజుకు పెరుగుతున్న సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా విద్యార్థులు వ్యక్తిగత సమాచారం, బ్యాంకు ఖాతా వివరాలు, ఓటీపీలు, పాస్‌వర్డ్‌లు వంటి గోప్యమైన సమాచారాన్ని ఎవరికీ వెల్లడించరాదని అధికారులు సూచించారు.

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం విస్సన్నపేటలోని వికాస్ పీజీ క్యాంపస్‌లో గురువారం సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఆన్‌లైన్ మోసాలు, నకిలీ లింకులు, సోషల్ మీడియా ద్వారా జరిగే మోసాలు, డిజిటల్ భద్రతకు సంబంధించిన జాగ్రత్తలపై సమగ్రంగా వివరించారు. తెలియని వ్యక్తుల నుంచి వచ్చే కాల్స్, సందేశాలు, వెబ్‌సైట్లు, లింకులను నమ్మరాదని, ఎలాంటి అనుమానం వచ్చినా వెంటనే పోలీసులను లేదా సైబర్ హెల్ప్‌లైన్‌ను సంప్రదించాలని సూచించారు.

సాంకేతిక పరిజ్ఞానం ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో, అదే స్థాయిలో సైబర్ నేరగాళ్లు కూడా కొత్త పద్ధతులతో మోసాలకు పాల్పడుతున్నారని అధికారులు తెలిపారు. అప్రమత్తతే సైబర్ నేరాల నుంచి రక్షణకు ప్రధాన ఆయుధమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో వికాస్ విద్యాసంస్థల అధినేత ఎన్. నర్సిరెడ్డి, మైలవరం ఏసీపీ పెరవల్లి రామచంద్రరావు, తిరువూరు సీఐ కే. గిరిబాబు, సైబర్ క్రైమ్ సబ్‌ ఇన్‌స్పెక్టర్, విస్సన్నపేట సబ్‌ ఇన్‌స్పెక్టర్ ఎం. అర్జున్ రాజు పాల్గొని విద్యార్థులకు సైబర్ భద్రతపై విలువైన సూచనలు అందించారు.