విశాఖ చేరుకున్న ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
ప్రపంచ ఏనుగుల దినోత్సవ జాతీయ వేడుకల్లో పాల్గొనేందుకు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గురువారం విశాఖపట్నం చేరుకున్నారు. విమానాశ్రయంలో ఆయనకు ఎమ్మెల్యేలు పంచకర్ల రమేష్ బాబు, వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్, సుందరపు విజయ్ కుమార్, విష్ణుకుమార్ రాజు, డీసీసీబీ ఛైర్మన్ కోన తాతారావు, రాష్ట్ర జానపద సృజనాత్మక అకాడమీ ఛైర్మన్ వంపూరి గంగులయ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ వన్నెంరెడ్డి సతీష్తో పాటు జిల్లా అధికారులు, పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు.
ఇటీవల భుజానికి శస్త్రచికిత్స జరిగినప్పటికీ, చేతికి ఇబ్బంది ఉన్నా పవన్ కళ్యాణ్ వాహనం నుంచి దిగి స్వాగతం పలికేందుకు వచ్చిన ప్రతి ఒక్కరికీ అభివాదం చేస్తూ ముందుకు సాగారు.
అనంతరం కేంద్ర సహాయ మంత్రి కీర్తివర్థన్ సింగ్తో కలిసి ప్రపంచ ఏనుగుల దినోత్సవ జాతీయ వేడుకల్లో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు.