www.ntodaynews.com
విశాఖలో దారుణం.. మహిళను హత్య చేసి బంగారం దోపిడి
ఆంధ్రప్రదేశ్
/
విశాఖపట్నం
ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం ఘోర ఘటన చోటు చేసుకుంది. అక్కయ్యపాలెం శ్రీనివాస్ నగర్లోని పుట్ట బంగారమ్మ గుడి సమీపంలో పార్వతి(53) అనే మహిళను గుర్తుతెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు.
దుండగులు మహిళ గొంతు కోసి హత్య చేసిన అనంతరం ఆమె మెడలో ఉన్న నల్లపూసల తాడు, బంగారు గొలుసు, చెవి దిద్దులు సహా బంగారు ఆభరణాలను కాజేసినట్లు సమాచారం.
మృతురాలి భర్త పాన్ షాప్ నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనతో ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని ఆధారాలు సేకరించారు.
హత్య వెనుక దోపిడీ కోణమా..? లేక వ్యక్తిగత విభేదాలు వంటి ఇతర కారణాలున్నాయా..? అనే దానిపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు.