www.ntodaynews.com
విశాఖలో సౌత్ కోస్టల్ రైల్వే జోన్ కార్యాలయం సందర్శన
ఆంధ్రప్రదేశ్
విశాఖలో సౌత్ కోస్టల్ రైల్వే జోన్ కార్యాలయం సందర్శన
విశాఖపట్నంలోని వీఎంఆర్డీఏ కార్యాలయంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన సౌత్ కోస్టల్ రైల్వే జోన్ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తో కలిసి నేడు సందర్శించారు.
ఈ సందర్భంగా కొత్త జోన్ కార్యకలాపాలు, ఆంధ్రప్రదేశ్లో రైల్వే ప్రాజెక్టుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. అరకు–కొత్తవలస సెక్షన్, కర్నూలు–డోన్ మార్గాలను కొత్త జోన్లో కలపడం ద్వారా ఆయా ప్రాంతాల అభివృద్ధికి అవకాశాలు పెరుగుతాయని తెలిపారు.
సమావేశంలో దక్షిణ మధ్య, తూర్పు, దక్షిణ కోస్తా రైల్వే జోన్ల ఉన్నతాధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.