www.ntodaynews.com
విశాఖపట్నం లో ఓపీఎస్ ఉద్యోగుల కృతజ్ఞతాభివందన సభ ఘనంగా
ఆంధ్రప్రదేశ్
/
విశాఖపట్నం
విశాఖపట్నం లో ఓపీఎస్ ఉద్యోగుల కృతజ్ఞతాభివందన సభ ఘనంగా
విశాఖపట్నంలో ఓపీఎస్ ఉద్యోగుల కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి కృతజ్ఞతగా ఓపీఎస్ ఉద్యోగులు ఘనంగా కృతజ్ఞతాభివందన సభ నిర్వహించారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి ఉద్యోగులు క్షీరాభిషేకం నిర్వహించి, "థ్యాంక్ యూ సీఎం సార్" అంటూ నినాదాలు చేశారు. సభా ప్రాంగణం ఉద్యోగుల హర్షధ్వానాలతో మార్మోగింది.
కార్యక్రమంలో పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు పాల్గొని ఉద్యోగులను అభినందిస్తూ వారి ఆనందంలో భాగస్వాములయ్యారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఓపీఎస్ ఉద్యోగుల కుటుంబాలకు ఆర్థిక భద్రతను కల్పించే కీలక నిర్ణయమని పలువురు అభిప్రాయపడ్డారు.