BREAKING
వర్షాకాలంలో డ్రైన్ల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలి విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఎంపీ కేశినేని చిన్ని Vijayawada: ఇంద్రకీలాద్రిపై వైభవంగా ఏరువాక పౌర్ణమి వేడుకలు.. రైతు మహిళలకు పవిత్ర వడ్ల పంపిణీ Nandyal: నేషనల్ హైవే 167K పనులు వేగవంతం.. గాలేరు నదిపై కొత్త వంతెన నిర్మాణం Hyderabad: వీ వైశ్య గ్లోబల్ కాంక్లేవ్–2026 విజయవంతం.. Pulse Polio: పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి.. చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు Pulse Polio: విజయవాడలో పల్స్ పోలియో కార్యక్రమానికి శ్రీకారం.. ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలి: కమిషనర్ ధ్యానచంద్ర RTC: విజయవాడ, గుంటూరు బస్సుల కొరతతో ప్రయాణికుల అవస్థలు TDP: ప్రజలతో మమేకమయ్యేందుకు 'సర్' గొప్ప అవకాశం: ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు Health: పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి.. వర్షాకాలంలో డ్రైన్ల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలి విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఎంపీ కేశినేని చిన్ని Vijayawada: ఇంద్రకీలాద్రిపై వైభవంగా ఏరువాక పౌర్ణమి వేడుకలు.. రైతు మహిళలకు పవిత్ర వడ్ల పంపిణీ Nandyal: నేషనల్ హైవే 167K పనులు వేగవంతం.. గాలేరు నదిపై కొత్త వంతెన నిర్మాణం Hyderabad: వీ వైశ్య గ్లోబల్ కాంక్లేవ్–2026 విజయవంతం.. Pulse Polio: పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి.. చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు Pulse Polio: విజయవాడలో పల్స్ పోలియో కార్యక్రమానికి శ్రీకారం.. ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలి: కమిషనర్ ధ్యానచంద్ర RTC: విజయవాడ, గుంటూరు బస్సుల కొరతతో ప్రయాణికుల అవస్థలు TDP: ప్రజలతో మమేకమయ్యేందుకు 'సర్' గొప్ప అవకాశం: ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు Health: పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి..
www.ntodaynews.com

విశ్రాంత ప్రధానోపాధ్యాయులు యన్నం రంగారెడ్డి కన్నుమూత

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
29 Jun, 2026 - 03:48 PM
51 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామానికి చెందిన విశ్రాంత హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు యన్నం రంగారెడ్డి (84) సోమవారం ఉదయం కన్నుమూశారు.

గత కొంతకాలంగా హైదరాబాద్‌లో తన కుమారుడు చక్రపాణి వద్ద ఉంటున్న రంగారెడ్డి అనారోగ్య కారణాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన భార్య కొంతకాలం క్రితమే మరణించారు.

యన్నం రంగారెడ్డి తెలంగాణ రాష్ట్రంలోని పలు హైస్కూల్‌లలో ఉపాధ్యాయుడిగా, ప్రధానోపాధ్యాయుడిగా సేవలందించారు. అనంతరం మండల విద్యాశాఖ అధికారిగా కూడా పనిచేశారు. విద్యార్థుల పట్ల అపారమైన ప్రేమ, అంకితభావంతో ఎంతోమంది పేద విద్యార్థులకు ఉచితంగా విద్యాబోధన చేసి ఆదర్శ ఉపాధ్యాయుడిగా గుర్తింపు పొందారు.

ఆయన మృతిపట్ల విశ్రాంత ప్రధానోపాధ్యాయులు ముక్కెర వెంకటప్ప రెడ్డి, విశ్రాంత ప్రిన్సిపాల్ వెదురు వెంకటరెడ్డి, స్థానిక సాయిబాబా కమిటీ సభ్యులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. యన్నం రంగారెడ్డి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.