www.ntodaynews.com
వితంతు పెన్షన్లపై కీలక అప్డేట్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వితంతు పెన్షన్ల పంపిణీపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కీలక ప్రకటన చేశారు. కొత్తగా 2.20 లక్షల మందిని అర్హులుగా గుర్తించినట్లు తెలిపారు. వీరికి రానున్న ఒకటి నుంచి రెండు నెలల్లో పెన్షన్లు అందించనున్నట్లు వెల్లడించారు. ఇందుకు అవసరమైన విధివిధానాలను రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం 62,34,445 మంది లబ్ధిదారులకు పెన్షన్లు అందుతున్నాయని, ఇందుకోసం ఏటా సుమారు రూ.33 వేల కోట్లు ఖర్చవుతున్నట్లు మంత్రి వివరించారు.