www.ntodaynews.com
వరి కోత యంత్రాలకు టోకెన్లు పంపిణీ
ఆంధ్రప్రదేశ్
/
ఎన్టీఆర్
వరి కోత యంత్రాలకు టోకెన్లు పంపిణీ
విస్సన్నపేట మండలంలో వరి కోతల నేపథ్యంలో డీజిల్ సరఫరా కోసం వ్యవసాయ శాఖ చర్యలు చేపట్టింది. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు వరి కోత యంత్రాల యజమానులు మరియు రైతులకు సూచనలు జారీ చేశారు.
వరి కోతలు జరుగుతున్న ఈ సమయంలో డీజిల్ అవసరం ఉన్న యంత్రాల యజమానులు తమ యంత్రాల సీబుక్, కోతలు జరుగుతున్న సర్వే నంబర్ వివరాలతో సంబంధిత గ్రామ వ్యవసాయ, ఉద్యాన శాఖ సిబ్బంది లేదా గ్రామ రెవెన్యూ అధికారిని సంప్రదించాలి. అక్కడ నుంచి టోకెన్లు పొందిన తరువాత మాత్రమే డీజిల్ తీసుకోవాలని సూచించారు.
ఈ ప్రక్రియ వల్ల ఎలాంటి ఇబ్బందులు లేకుండా డీజిల్ సరఫరా జరుగుతుందని, రైతులు మరియు హార్వెస్టర్ యజమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మండల వ్యవసాయాధికారి జీ.రాజ్యలక్ష్మీ తెలిపారు.