www.ntodaynews.com
వరి సాగులో రసాయనాలకు చెక్.. ఘనజీవామృతం తయారీపై రైతులకు క్షేత్రస్థాయి శిక్షణ
ఆంధ్రప్రదేశ్
/
ఏలూరు
ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ఎండపల్లి గ్రామంలోని జె. పుల్లారావు బయో రిసోర్స్ సెంటర్లో ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై రైతులకు క్షేత్రస్థాయి శిక్షణ నిర్వహించారు.
ప్రకృతి వ్యవసాయ అధికారి మినుమాధుర్య ఆధ్వర్యంలో వరి నాట్లు వేసే ముందు దమ్ములో వినియోగించే 200 కిలోల ఘనజీవామృతం తయారీ విధానాన్ని రైతులకు ప్రత్యక్షంగా చూపించారు. రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించి, సహజ పద్ధతుల్లో అధిక దిగుబడులు సాధించేందుకు ఘనజీవామృతం ఉపయోగపడుతుందని వివరించారు.
ఈ కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయ సిబ్బంది, ఫార్మర్ ట్రైనర్ గుత్తి శ్రీనివాస వర్మ పాల్గొని రైతులకు ఘనజీవామృతం తయారీ, వినియోగం, ప్రయోజనాలపై అవగాహన కల్పించారు.