BREAKING
శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి
www.ntodaynews.com

వర్షాభావ హెచ్చరిక.. రాష్ట్రాలకు కేంద్ర వ్యవసాయ శాఖ అప్రమత్తం

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
25 May, 2026 - 11:31 AM
120 వీక్షణలు

దేశంలో ఈ ఏడాది వర్షపాతం తగ్గే అవకాశం ఉందని కేంద్ర వ్యవసాయ శాఖ రాష్ట్ర ప్రభుత్వాలను అప్రమత్తం చేసింది. నీటి వనరులను అత్యంత జాగ్రత్తగా వినియోగించుకోవాలని, ముఖ్యంగా సాగునీటి వినియోగంలో సమర్థవంతమైన ప్రణాళికలు అమలు చేయాలని కీలక సూచనలు జారీ చేసింది.

రాబోయే ఖరీఫ్ సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని తక్కువ నీటితో సాగు చేయగల పంటలను ప్రోత్సహించాలని కేంద్రం సూచించింది. చెరువులు, రిజర్వాయర్లు, భూగర్భ జలాల వినియోగంపై ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టాలని రాష్ట్రాలకు ఆదేశాలు ఇచ్చింది.

రైతులకు ముందస్తు అవగాహన కల్పిస్తూ నీటి పొదుపు పద్ధతులు, మైక్రో ఇరిగేషన్ విధానాలను విస్తృతంగా అమలు చేయాలని పేర్కొంది. వర్షాభావ పరిస్థితులు ఎదురైనా ఆహార ఉత్పత్తిపై ప్రభావం తగ్గించేలా సమన్వయంతో చర్యలు తీసుకోవాలని కేంద్ర వ్యవసాయ శాఖ స్పష్టం చేసింది.

ఈ నేపథ్యంలో రైతులు నీటి వినియోగంలో జాగ్రత్తలు పాటిస్తూ, తక్కువ నీటితో సాగు అయ్యే పంటల వైపు మొగ్గు చూపాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.