Devotional: సమృద్ధిగా వర్షాలు కురవాలని పెనుగొలను గ్రామంలో నగర సంకీర్తన
ఎన్టీఆర్ జిల్లా | గంపలగూడెం మండలం | జూన్ 29 | NTODAY NEWS
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలోని గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామంలో సమృద్ధిగా వర్షాలు కురిసి గ్రామం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ గ్రామస్తులు ఆదివారం భక్తిశ్రద్ధలతో నగర సంకీర్తన నిర్వహించారు.
కార్యక్రమంలో భాగంగా బొడ్రాయి సెంటర్లోని ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శివాలయం నుంచి ప్రారంభమైన నగర సంకీర్తన రేడియా సెంటర్, వాటర్ ట్యాంక్ రోడ్డు, బస్టాండ్, తిరువూరు రోడ్డు, రామాలయం మీదుగా కొనసాగింది.
భక్తులు భగవన్నామ స్మరణ చేస్తూ భక్తి గీతాలు ఆలపించారు. గ్రామంలో సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని, రైతులు సుఖసంతోషాలతో ఉండాలని, ప్రజలందరికీ ఆయురారోగ్యాలు కలగాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
ఈ కార్యక్రమంలో సత్యసాయి సేవా కమిటీ సభ్యులు డాక్టర్ జి. నరసింహారావు, సుగ్గల హనుమంతరావు, పారేపల్లి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.