BREAKING
MRP కన్నా ఎక్కువ డబ్బులు అడిగితే కింద ఉన్న నెంబర్లకు కాల్ చేసి చెప్పండి ఒంటరి మహిళపై అత్యాచారం ఇద్దరు అన్నదమ్ముల అరెస్ట్ ప్రకాశం జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన రేపు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం ప్రజా గ్రీవెన్స్ కార్యక్రమం అనారోగ్యంతో వ్యక్తి ఆత్మహత్య కొండవీడులో ప్రపంచ పర్యావరణ దినోత్సవం జాతీయ రహదారిపై నిలిచిపోయిన ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు చిలకలూరిపేట స్థానిక రైతు బజార్లో గుర్తు తెలియని వ్యక్తి మృతి ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా దేవవరంలో మొక్కల నాటకం పసుమరు గ్రామంలో హెచ్‌ఐవీ, సుఖవ్యాధులపై అవగాహన సదస్సు MRP కన్నా ఎక్కువ డబ్బులు అడిగితే కింద ఉన్న నెంబర్లకు కాల్ చేసి చెప్పండి ఒంటరి మహిళపై అత్యాచారం ఇద్దరు అన్నదమ్ముల అరెస్ట్ ప్రకాశం జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన రేపు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం ప్రజా గ్రీవెన్స్ కార్యక్రమం అనారోగ్యంతో వ్యక్తి ఆత్మహత్య కొండవీడులో ప్రపంచ పర్యావరణ దినోత్సవం జాతీయ రహదారిపై నిలిచిపోయిన ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు చిలకలూరిపేట స్థానిక రైతు బజార్లో గుర్తు తెలియని వ్యక్తి మృతి ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా దేవవరంలో మొక్కల నాటకం పసుమరు గ్రామంలో హెచ్‌ఐవీ, సుఖవ్యాధులపై అవగాహన సదస్సు
www.ntodaynews.com

ప్రభుత్వ పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్

తెలంగాణ
25 Jun, 2025 - 05:34 AM
123 వీక్షణలు
విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి, ప్రభుత్వ పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు NTODAY NEWS: భువనగిరి పాఠశాలలో మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని, విద్యార్థులకు అర్థమయ్యే విధంగా విద్యను బోధించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు సంబంధిత అధికారులను ఆదేశించారు.బుధవారం భువనగిరి మున్సిపాలిటీ పరిధిలోని రాయగిరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పాఠశాలలో మధ్యాహ్నం భోజనం పథకంలో భాగంగా విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందిస్తున్నారా లేదా అని సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయులని అడిగి తెలుసుకొని, విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలని ఆదేశించారు. నాణ్యమైన భోజనం అందిస్తేనే జ్ఞాపకశక్తి పెరిగి విద్యార్థులు మంచిగా చదువుతారని అన్నారు. అనంతరం పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు విద్యాబోధన చేస్తున్న విధానాన్ని కలెక్టర్ స్వయంగా పరిశీలించి విద్యార్థులతో మాట్లాడుతూ ఇప్పటినుండే పరీక్షలకు ఎలా ప్రిపేర్ అవ్వాలనే ఒక ప్రణాళిక వేసుకొని చదివినవి మర్చిపోకుండా రివిజన్ చేసుకుంటూ మంచిగా చదవాలని విద్యార్థులకు హిత బోధ చేశారు.పదవ తరగతి అనేది జీవితంలో ముందుకు పోవడానికి తొలి మెట్టు కాబట్టి మంచిగా చదవుకోని ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నారు. ఇష్టంతో కష్టపడి చదివితే తప్పనిసరిగా మంచి మార్కులతో ఉతీర్ణులవుతారని కలెక్టర్ విద్యార్థులకు సూచించారు. కలెక్టర్ వెంట పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఆండాలు, సిబ్బంది ఉన్నారు. Follow us on Website Facebook Instagram YouTube