BREAKING
సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత
www.ntodaynews.com

ప్రభుత్వ పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్

తెలంగాణ
25 Jun, 2025 - 05:34 AM
190 వీక్షణలు
విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి, ప్రభుత్వ పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు NTODAY NEWS: భువనగిరి పాఠశాలలో మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని, విద్యార్థులకు అర్థమయ్యే విధంగా విద్యను బోధించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు సంబంధిత అధికారులను ఆదేశించారు.బుధవారం భువనగిరి మున్సిపాలిటీ పరిధిలోని రాయగిరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పాఠశాలలో మధ్యాహ్నం భోజనం పథకంలో భాగంగా విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందిస్తున్నారా లేదా అని సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయులని అడిగి తెలుసుకొని, విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలని ఆదేశించారు. నాణ్యమైన భోజనం అందిస్తేనే జ్ఞాపకశక్తి పెరిగి విద్యార్థులు మంచిగా చదువుతారని అన్నారు. అనంతరం పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు విద్యాబోధన చేస్తున్న విధానాన్ని కలెక్టర్ స్వయంగా పరిశీలించి విద్యార్థులతో మాట్లాడుతూ ఇప్పటినుండే పరీక్షలకు ఎలా ప్రిపేర్ అవ్వాలనే ఒక ప్రణాళిక వేసుకొని చదివినవి మర్చిపోకుండా రివిజన్ చేసుకుంటూ మంచిగా చదవాలని విద్యార్థులకు హిత బోధ చేశారు.పదవ తరగతి అనేది జీవితంలో ముందుకు పోవడానికి తొలి మెట్టు కాబట్టి మంచిగా చదవుకోని ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నారు. ఇష్టంతో కష్టపడి చదివితే తప్పనిసరిగా మంచి మార్కులతో ఉతీర్ణులవుతారని కలెక్టర్ విద్యార్థులకు సూచించారు. కలెక్టర్ వెంట పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఆండాలు, సిబ్బంది ఉన్నారు. Follow us on Website Facebook Instagram YouTube