BREAKING
NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన
www.ntodaynews.com

యర్రంపల్లిలో జానకిరెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
22 Aug, 2026 - 04:28 PM
61 వీక్షణలు

యర్రంపల్లి, చింతలపూడి మండలం - ఆగస్టు 22:

వైఎస్సార్సీపీ మాజీ ఏఎంసీ చైర్మన్, ఏలూరు జిల్లా ఉపాధ్యక్షురాలు జగ్గవరపు జానకిరెడ్డి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఈ నేపథ్యంలో చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ శనివారం యర్రంపల్లిలోని జానకిరెడ్డి స్వగృహానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

జానకిరెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే, అనంతరం కుటుంబ సభ్యులతో మాట్లాడి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ కష్ట సమయంలో కుటుంబ సభ్యులు మనోధైర్యంతో ఉండాలని కోరుతూ, జానకిరెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు.

రాజకీయాలకు అతీతంగా మానవత్వంతో స్పందిస్తూ కుటుంబానికి అండగా నిలిచినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గంటా మురళీ రామకృష్ణ, ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి జగ్గవరపు ముత్తారెడ్డి, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. :::