యర్రంపల్లిలో జానకిరెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్
యర్రంపల్లి, చింతలపూడి మండలం - ఆగస్టు 22:
వైఎస్సార్సీపీ మాజీ ఏఎంసీ చైర్మన్, ఏలూరు జిల్లా ఉపాధ్యక్షురాలు జగ్గవరపు జానకిరెడ్డి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఈ నేపథ్యంలో చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ శనివారం యర్రంపల్లిలోని జానకిరెడ్డి స్వగృహానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
జానకిరెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే, అనంతరం కుటుంబ సభ్యులతో మాట్లాడి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ కష్ట సమయంలో కుటుంబ సభ్యులు మనోధైర్యంతో ఉండాలని కోరుతూ, జానకిరెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు.
రాజకీయాలకు అతీతంగా మానవత్వంతో స్పందిస్తూ కుటుంబానికి అండగా నిలిచినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గంటా మురళీ రామకృష్ణ, ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి జగ్గవరపు ముత్తారెడ్డి, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. :::