BREAKING
కిల్కారి కాల్ సేవలు పై అవగాహన కార్యక్రమం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి పాలమూరు సమస్యలు.. బహిరంగ లేఖతో జేఏసీ వినతి త్రికోటేశ్వర స్వామి దర్శించుకున్న తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు కొండపర్వ లో సహజ వ్యవసాయంపై 3 రోజుల ఉచిత శిక్షణ దూపిశెట్టి వారి నూతన వస్త్ర వేడుకలు జీఎస్టీ అప్పిలేట్ ట్రైబ్యునల్ ప్రారంభం నేడు ఐదుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ప్రమాణస్వీకారం.. నూజివీడులో బుధవారం మంత్రి కొలుసు పార్థసారథి పర్యటన.. ఆదానికి ఎఫ్‌సీఐ సైలో కాంట్రాక్టులు.. దేశ ఆహార భద్రతకు ముప్పు కొండపర్వ వద్ద ప్రమాద ఘంటికలు.. రోడ్డుపై కుప్పకూలిన భారీ వృక్షం కొమ్మలు! కిల్కారి కాల్ సేవలు పై అవగాహన కార్యక్రమం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి పాలమూరు సమస్యలు.. బహిరంగ లేఖతో జేఏసీ వినతి త్రికోటేశ్వర స్వామి దర్శించుకున్న తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు కొండపర్వ లో సహజ వ్యవసాయంపై 3 రోజుల ఉచిత శిక్షణ దూపిశెట్టి వారి నూతన వస్త్ర వేడుకలు జీఎస్టీ అప్పిలేట్ ట్రైబ్యునల్ ప్రారంభం నేడు ఐదుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ప్రమాణస్వీకారం.. నూజివీడులో బుధవారం మంత్రి కొలుసు పార్థసారథి పర్యటన.. ఆదానికి ఎఫ్‌సీఐ సైలో కాంట్రాక్టులు.. దేశ ఆహార భద్రతకు ముప్పు కొండపర్వ వద్ద ప్రమాద ఘంటికలు.. రోడ్డుపై కుప్పకూలిన భారీ వృక్షం కొమ్మలు!
www.ntodaynews.com

మోహిని ఉత్సవంలో పాల్గొన్న వైఎస్ఆర్సిపి సమన్వయకర్త

తెలంగాణ
08 Mar, 2026 - 06:06 AM
98 వీక్షణలు
కదిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో మోహిని ఉత్సవం… పాల్గొన్న వైఎస్ఆర్సిపి సమన్వయకర్త బిఎస్ మక్బుల్ NTODAY NEWS: కదిరి నియోజకవర్గం ప్రతినిధి వినోద్ కుమార్ కదిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా శనివారం నిర్వహించిన మోహిని ఉత్సవంలో కదిరి వైఎస్ఆర్సిపి సమన్వయకర్త బిఎస్ మక్బుల్ పాల్గొన్నారు. మొదట ఆలయంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి మూలవిరాట్‌ను దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం యాగశాలలో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో పాల్గొని వేద పండితుల ఆశీర్వాదాలు అందుకున్నారు. తదనంతరం అలంకరణ మండపంలో మోహిని అవతారంలో అలంకరించిన ఉత్సవమూర్తులను దర్శించారు. అక్కడ కూడా అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయ అర్చకులు మక్బుల్‌కు ఆశీస్సులు అందించారు. ఈ సందర్భంగా రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరికీ ఆయురారోగ్యాలతో పాటు అష్టైశ్వర్యాలు కలగాలని స్వామివారిని బిఎస్ మక్బుల్ ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర SEC మెంబర్ డాక్టర్ బత్తల హరి ప్రసాద్, మాజి ఆలయ కమిటీ చైర్మన్ జరిపిటి గోపాల కృష్ణా, నల్లచెరువు కన్వినర్ మొండెం రవికుమార్, పాలపాటి దీన్ని మాజి ఆలయ చైర్మన్ ఆనంద్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు బాబ్జాన్, రాష్ట్ర విద్యార్ధి విభాగం కార్యదర్శి వల్లమ్ రాజేంద్ర, జిల్లా అధికార ప్రతినిధి లింగాల మధుసూదన్ రెడ్డి, సీనియర్ నాయకులు కొక్కంటి శ్రీనివాస నాయుడు, జిల్లా ఎస్సి ఉపాధ్యక్షులు భాస్కర్, చెన్నూర్ గంగాధర్, నియోజకవర్గం ఎస్సి అధ్యక్షులు మేకల నర్సింహులు, పట్టణ ఎస్సి అధ్యక్షులు చిన్న రెడ్డెప్ప, ఎస్టీ సెల్ బాబు నాయక్, యూత్ అధ్యక్షులు నియోజకవర్గం రమేష్ యాదవ్, పట్టణ యూత్ N. బాబా, వాణిజ్య విభాగం అధ్యక్షులు షకీల్, MPTC బాలు, వైస్సార్సీపీ నాయకులు సమీర్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. #Kadiri #YSRCP #BSMaqbool #LakshmiNarasimhaSwamy #Brahmotsavam #AndhraPradeshNews #TempleNews #NTodayNews Follow us on Website Facebook Instagram YouTube