11 రోజుల విదేశీ పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డి.. తొలుత ఢిల్లీకి, ఆపై బ్రిటన్, అమెరికా పర్యటన
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. అక్కడ జరగనున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో సీఎం పాల్గొననున్నారు.
ఢిల్లీ పర్యటన అనంతరం అదే రోజు సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి బ్రిటన్ పర్యటనకు బయలుదేరనున్నారు. బ్రిటన్ పర్యటన ముగిసిన తర్వాత అమెరికాకు వెళ్లనున్నారు.
ఈ విదేశీ పర్యటనలో భాగంగా బ్రిటన్, అమెరికాలోని పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులతో సీఎం సమావేశాలు నిర్వహించనున్నారు. తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించి, రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టేలా వారిని ఆహ్వానించనున్నారు.
రాష్ట్ర అభివృద్ధి, పారిశ్రామిక విస్తరణ, ఉపాధి అవకాశాల పెంపు లక్ష్యంగా ఈ పర్యటన కొనసాగనుంది. సీఎం వెంట ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్తో పాటు పలువురు ఉన్నతాధికారులు కూడా వెళ్లనున్నారు.
మొత్తం 11 రోజుల పాటు ఈ విదేశీ పర్యటన కొనసాగనున్నట్లు సమాచారం.