www.ntodaynews.com
14న ఉపాధ్యాయ సంఘాల భారీ ఆందోళనకు సన్నాహాలు.. ప్రభుత్వంపై పోరుకు ఐక్యవేదిక సిద్ధం
ఆంధ్రప్రదేశ్
/
అన్నమయ్య
అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక శనివారం కీలక సన్నాహ సమావేశం నిర్వహించింది. ఈ నెల 14న రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో చేపట్టనున్న ర్యాలీలు, పికెటింగ్ కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు కార్యాచరణను ఖరారు చేసింది. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే దిశగా పెద్దఎత్తున ఉద్యమాన్ని విజయవంతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.
సమావేశంలో ఫ్యాప్టో చైర్మన్ కె. హేమలతతో పాటు గణేష్ భూపతి, మధుబాబు, విజయ్కుమార్, నరసింహులు, పురం వెంకటరమణ, రవిప్రకాశ్ తదితర వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు పాల్గొని ఉద్యమ కార్యాచరణపై చర్చించారు. 14న జరిగే ఆందోళన కార్యక్రమాల్లో ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.