BREAKING
రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం
www.ntodaynews.com

పెనుగొలనులో భక్తిశ్రద్ధలతో నగర సంకీర్తన.. గోమాతకు ప్రత్యేక పూజలు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
12 Jul, 2026 - 07:54 AM
86 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా, గంపలగూడెం మండలం: తిరువూరు నియోజకవర్గంలోని పెనుగొలను గ్రామంలో శ్రీ సత్యసాయి బాబా సేవా కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం నిర్వహించిన నగర సంకీర్తన భక్తిపారవశ్య వాతావరణంలో ఘనంగా జరిగింది. భక్తులు "ఓం సాయి", "శ్రీ సాయి", "జయజయ సాయి" నామస్మరణతో గ్రామ వీధులను మార్మోగించారు.

షిరిడి సాయిబాబా మందిరం నుంచి ప్రారంభమైన నగర సంకీర్తన రేడియా రూము, వాటర్ ట్యాంక్ రోడ్డు, బొడ్రాయి సెంటర్, రామాలయం మీదుగా కొనసాగి బస్టాండ్ సెంటర్‌కు చేరుకుంది. అక్కడ సకల దేవతల స్వరూపంగా భావించే గోమాతకు ప్రత్యేక గోపూజలు నిర్వహించి భక్తులు విశేషంగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జరిగిన సభలో శ్రీ సత్యసాయి బాబా సేవా కమిటీ అధ్యక్షుడు డాక్టర్ జి. నరసింహారావు మాట్లాడుతూ, గోసేవ, గోపూజ చేయడం వల్ల సమస్త పాపాలు నశించి సుఖశాంతులు, మానసిక ప్రశాంతత లభిస్తాయని పురాణాలు పేర్కొన్నాయని తెలిపారు. సమాజంలో ధర్మం, సేవాభావం, ఆధ్యాత్మిక చైతన్యం పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని చెప్పారు.

ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు సుగ్గల హనుమంతరావు, పారేపల్లి కృష్ణారావు, పాశం వెంకటేశ్వర్లు, సుగ్గల విష్ణు, వడ్డెరపు నాగయ్యతో పాటు గ్రామస్తులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.