మాట నిలబెట్టుకున్న యువశక్తి యువజన సంఘం
చదువులో ఉన్నతంగా రాణిస్తే నగదు ప్రోత్సాహం అందజేస్తామని మాట ఇచ్చిన యువశక్తి విజన సంఘం సభ్యులు ఇచ్చిన మాట కట్టుబడి ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థినికి నగదు బహుమతి అందజేశారు.చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని పదవ వార్డులో యువశక్తి యువజన సంఘం ఆధ్వర్యంలో పదవ తరగతి ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించిన 10వ వార్డుకి చెందిన ధరణికోట దినేష్ కుమార్తె ధరణికోట జయశ్రీ(న్యూ లిటిల్ ఫ్లవర్ స్కూల్)కి యువశక్తి యువజన సంఘం అధ్యక్షులు చింతపల్లి ప్రవీణ్ ఆధ్వర్యంలో రూ.5000 నగదు బహుమతి అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా
సంఘం అధ్యక్షులు ప్రవీణ్ మాట్లాడుతూ గత సంవత్సరం యువశక్తి యువజన సంఘం ఇచ్చిన హామీ మేరకు అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థినికి నగదు బహుమతి అందజేయడం జరిగిందని విద్యార్థులు చదువులో ఉన్నతంగా రాణించాలనే లక్ష్యంతోయు యువశక్తి యువజన సంఘం ఆధ్వర్యంలో ప్రోత్సాహం అందిస్తున్నామని మున్ముందు కూడా మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి మద్ది మధు,కోశాధికారి బొడ్డుపల్లి ఉపేందర్, సిలివేరు పరమేశ్, నిమ్మనగోటి శ్రీనివాస్,ఆవుల మహేష్, ఐలపురం నరేష్,గూడ అఖిల్, సిలివేరు రిశ్వంత్,మైల నుకేశ్, బొడ్డుపల్లి ప్రసాద్, శ్రీశాంత్, తిరుపాల గణేష్, రాంచరణ్,ఎస్కే ఉస్మాన్ తదితరులు పాల్గొనడం జరిగింది.