BREAKING
రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం
www.ntodaynews.com

​ఈశ్వరమ్మ యాదవ్‌పై అనుచిత వ్యాఖ్యలు దురదృష్టకరం: గొర్ర తిరుపతి యాదవ్

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
12 Jul, 2026 - 09:59 PM
96 వీక్షణలు

మంచిర్యాల: యాదగిరిగుట్ట దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్‌పర్సన్‌ శ్రీమతి ఈశ్వరమ్మ యాదవ్‌పై జరిగిన అనుచిత వ్యాఖ్యలను యాదవ హక్కుల పోరాట సమితి తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు సమితి రాష్ట్ర కార్యదర్శి గొర్ర తిరుపతి యాదవ్ ఒక ప్రకటనలో మాట్లాడుతూ... ఒక మహిళను, సామాజిక వర్గాన్ని అవమానించేలా మాట్లాడటం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని మండిపడ్డారు. యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కడి శివచరణ్ రెడ్డి వెంటనే తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చి, బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పందించి, పార్టీ క్రమశిక్షణ ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

​అదేవిధంగా, ఎన్నికల సందర్భంగా గొల్ల–కురుమ–యాదవులకు ఇచ్చిన హామీల అమలుపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని తిరుపతి యాదవ్ డిమాండ్ చేశారు. ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఈ ఆరోపణలు, హామీల అంశంపై ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోకపోతే, యాదవ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా శాంతియుత, రాజ్యాంగబద్ధమైన నిరసన కార్యక్రమాలను చేపడుతామని ఆయన హెచ్చరించారు