www.ntodaynews.com
జానకమ్మకు సీఎం చంద్రబాబు ఘన నివాళి
ఆంధ్రప్రదేశ్
శనివారం తుది శ్వాస విడిచిన గానకోకిల, ప్రముఖ నేపథ్య గాయని ఎస్. జానకమ్మకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఘనంగా నివాళులర్పించారు.
క్యాంపు కార్యాలయంలో జానకమ్మ చిత్రపటానికి పూలమాల వేసి భారతీయ సంగీత రంగానికి ఆమె అందించిన విశిష్ట సేవలను స్మరించుకున్నారు. తెలుగు గడ్డపై జన్మించిన జానకమ్మ ఆరు దశాబ్దాలకు పైగా తన మధుర గానంతో కోట్లాది సంగీతాభిమానుల హృదయాల్లో చెరగని ముద్ర వేసారని పేర్కొన్నారు.
భాషల సరిహద్దులు దాటి ఆమె ఆలపించిన వేలాది గీతాలు తరతరాలకు చిరస్మరణీయంగా నిలిచిపోతాయని, సంగీత ప్రపంచానికి ఆమె మరపురాని వారసత్వాన్ని అందించారని సీఎం అన్నారు. జానకమ్మ కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ని ప్రార్థించారు.