www.ntodaynews.com
పవన్ను పరామర్శించిన సీఎం చంద్రబాబు.. ఆసుపత్రిలో ఆప్యాయ భేటీ
ఆంధ్రప్రదేశ్
ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరామర్శించారు. ఇటీవల భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న పవన్ ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్న సీఎం, అనంతరం పవన్తో కొంతసేపు ఆప్యాయంగా మాట్లాడారు.
త్వరగా కోలుకుని మళ్లీ ప్రజాసేవలోకి రావాలని ఆకాంక్షిస్తూ చంద్రబాబు ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఇద్దరు నేతలు రాష్ట్రంలోని పలు అంశాలపైనా స్వల్పంగా చర్చించినట్లు సమాచారం. సీఎం పరామర్శతో పవన్ అభిమానులు, జనసేన శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. త్వరలోనే పవన్ పూర్తిస్థాయిలో విధుల్లోకి తిరిగి వస్తారనే ఆశాభావం వ్యక్తమవుతోంది.