మందమర్రిలో ఘనంగా కుంగ్ ఫు బెల్ట్ ఎగ్జామినేషన్స్
మందమర్రి: మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణ సింగరేణి హైస్కూల్ మైదానంలో మాస్టర్ జెట్టి కృష్ణ సారథ్యంలో కుంగ్ ఫు విద్యార్థులకు బెల్ట్ ఎగ్జామినేషన్ కార్యక్రమం ఆదివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మందమర్రి పట్టణ ఏఎస్ఐ మిలన్ కుమార్ మరియు సీనియర్ మాస్టర్లు.. పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు ఎల్లో, గ్రీన్, మెరూన్ బెల్టులతో పాటు సర్టిఫికెట్లను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గ్రాండ్ మాస్టర్ కంటేశ్వర్, అసిస్టెంట్ మాస్టర్ హరికృష్ణ మాట్లాడుతూ.. బాల్యం నుంచే కుంగ్ ఫు నేర్చుకోవడం వల్ల శారీరక, మానసిక దృఢత్వంతో పాటు ఆపద సమయాల్లో ఆత్మరక్షణ (సెల్ఫ్ డిఫెన్స్) లభిస్తుందని, సాధారణ విద్యార్థులు నాలుగు గంటల్లో చదివే అంశాలను క్రీడాకారులు తమ ఏకాగ్రతతో ఒక్క గంటలోనే అర్థం చేసుకోగలరని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాస్టర్లు రాజేష్, శ్రీనివాస్, టి. రవి, చందు, శ్రీనివాస్, శ్రీధర్, ప్రభాకర్, ఎంఎల్ రవి మరియు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు