BREAKING
పెరిచెర్ల జగనన్న కాలనీలో అధ్వానంగా ఇళ్ల నిర్మాణాలు చేయూత సామాజిక భద్రతా పింఛన్లకు దరఖాస్తుల ఆహ్వానం పంట కాలువలకు నీరేదీ.. రైతులపై అదనపు భారం..... వరంగల్ ఎంజీఎం లో రోగులకు తప్పని అవస్థలు పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం పెరిచెర్ల జగనన్న కాలనీలో అధ్వానంగా ఇళ్ల నిర్మాణాలు చేయూత సామాజిక భద్రతా పింఛన్లకు దరఖాస్తుల ఆహ్వానం పంట కాలువలకు నీరేదీ.. రైతులపై అదనపు భారం..... వరంగల్ ఎంజీఎం లో రోగులకు తప్పని అవస్థలు పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం
www.ntodaynews.com

వలిగొండలో గోవుల అక్రమ రవాణా భగ్నం

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / వలిగొండ
12 Jul, 2026 - 07:55 AM
162 వీక్షణలు

24 గోవులను రక్షించిన బజరంగ్ దళ్ కార్యకర్తలు

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ పట్టణ కేంద్రంలో గోవుల అక్రమ రవాణా కలకలం రేపింది. ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా తరలిస్తున్న 24 గోమాతలను బజరంగ్ దళ్ కార్యకర్తలు  చాకచక్యంగా పట్టుకున్నారు.

​విశ్వసనీయ సమాచారం ప్రకారం... ఆంధ్రప్రదేశ్ ప్రాంతం నుండి బహదూర్‌పురా వైపు ఒక వాహనంలో ఈ గోవులను అత్యంత దారుణంగా, ఇరుకైన రీతిలో తరలిస్తున్నారు. ఈ విషయాన్ని ముందే పసిగట్టిన బజరంగ్ దళ్ కార్యకర్తలు వలిగొండ పట్టణంలో సదరు వాహనాన్ని అడ్డుకున్నారు. వాహనాన్ని తనిఖీ చేయగా అందులో 24 గోవులు ఉన్నట్లు గుర్తించారు. గోవులను రక్షించిన కార్యకర్తలు వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించి, వాహనంతో పాటు గోవులను వారికి అప్పగించారు. అనంతరం రక్షించిన 24 గోమాతలను సురక్షితంగా సంరక్షించేందుకు గాను  యుగ తులసి ఫౌండేషన్ గోశాలకు తరలించారు.

​ఈ అక్రమ రవాణాపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. గోవులను ఎక్కడి నుండి తరలిస్తున్నారు? దీని వెనుక ఉన్న సూత్రధారులు ఎవరు? అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. ఈ కార్యక్రమంలో బజరంగ్ దళ్ ప్రతినిధులు, గో సంరక్షకులు  పాల్గొన్నారు.