www.ntodaynews.com
31వ వారం జ్ఞానమాల కార్యక్రమం
తెలంగాణ
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి 31వ వారం జ్ఞానమాల కార్యక్రమం
NTODAY NEWS: బీబీనగర్ ప్రతినిధి – బాల్ద. భాస్కర్ కురుమ
బీబీనగర్ మండలం కొండమడుగు గ్రామంలో ఎంఆర్పీఎస్ గ్రామ శాఖ ఆధ్వర్యంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి 31వ వారం జ్ఞానమాల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మొదటి వార్డు సభ్యుడు పెంట బోయిన భాను శ్రీ వేణు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆలోచన విధానం, ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు జ్ఞానమాల కార్యక్రమం ఎంతో ఉపయోగకరమని తెలిపారు. నేటి యువత అంబేద్కర్ ఆశయాలను అనుసరించి ఉన్నత విద్యలు అభ్యసించి సమాజంలో ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు.
అంబేద్కర్ తన జ్ఞానంతో ప్రపంచ మేధావిగా గుర్తింపు పొందారని, యువత మహనీయుల అడుగుజాడల్లో నడవాలని పిలుపునిచ్చారు. ప్రతి ఆదివారం జ్ఞానమాల కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొనాలని కోరారు.
ఈ సందర్భంగా మంచి ఆలోచనతో పాఠశాల విద్యార్థులకు నోట్బుక్స్ పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ కొండమడుగు గ్రామ శాఖ అధ్యక్షుడు, వార్డు సభ్యుడు కాడిగళ్ల బాబురావు, ఉపసర్పంచ్ అరిగే శ్రీధర్, వార్డు సభ్యులు ఆర్ముల్లా లావణ్య శ్రీకాంత్, కనుక బోయిన కిషోర్, బొడ్డు రజిత భాస్కర్, మంద భాస్కర్, కడెం వెంకటేష్, కడెం సంపూర్ణ కిరణ్, శివగళ్ల ఇస్తారి, మాజీ సర్పంచ్, ఎంఆర్పీఎస్ మండల మాజీ అధ్యక్షుడు ముల్గారం పాండు, దేవస్థాన కమిటీ మాజీ చైర్మన్ భూషపాక మల్లేష్, ఎంఆర్పీఎస్ గ్రామ శాఖ ఉపాధ్యక్షుడు చిన్నగల్ల లింగస్వామి, పంజాల శ్రీనివాస్ గౌడ్, బొడ్డు శివబాబు, చింతకాయల బాలయ్య, మందు ఆనంద్, బండమీది భారత్, చిన్నగల్ల రాము, ముల్గారం యశ్వంత్, బూడిది పండు, బత్తుల దీపక్ తదితరులు పాల్గొన్నారు.
#DrBRAmbedkar
#AmbedkarIdeology
#GnanamalaProgram
#MRPS
#SocialAwareness
#YouthEmpowerment
#DalitRights
#EducationForAll
#ConstitutionOfIndia
#TelanganaNews
Follow us on
Website
Facebook
Instagram
YouTube