www.ntodaynews.com
35వ వారం జ్ఞానమాల కార్యక్రమం
తెలంగాణ
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి 35వ వారంనాటి జ్ఞానమాల కార్యక్రమం నిర్వహణ
NTODAY NEWS – బీబీనగర్ ప్రతినిధి: బాల్ద. భాస్కర్ కురుమ
కొండమడుగు గ్రామంలో ఎంఆర్పిఎస్ గ్రామ శాఖ ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి 35వ వారంనాటి జ్ఞానమాల కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు సంధిగారి బసవయ్య, బీబీనగర్ మాజీ జెడ్పీటీసీ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ అంబేద్కర్ ఆలోచనా విధానం, ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు జ్ఞానమాల కార్యక్రమం ఉపయోగపడుతుందని తెలిపారు. యువత అంబేద్కర్ చూపిన మార్గంలో నడిచి ఉన్నత విద్యను అభ్యసించి జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని పిలుపునిచ్చారు. జ్ఞానం, రాజ్యాంగ విలువలతో ప్రపంచ మేధావిగా గుర్తింపు పొందిన అంబేద్కర్ ఆశయాలను అనుసరించాలని సూచించారు. ప్రతి ఆదివారం నిర్వహించే జ్ఞానమాల కార్యక్రమంలో ప్రజలు పాల్గొనాలని కోరారు.
కార్యక్రమంలో కొండమడుగు గ్రామ ఉపసర్పంచ్ అరిగే శ్రీధర్, మాజీ సర్పంచ్ శివగల్లా ఇస్తారు, ఎంఆర్పిఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు కాడిగళ్ల బాబురావు, వార్డు సభ్యులు ఆర్ముల్లా లావణ్య శ్రీకాంత్, బొడ్డు రజిత భాస్కర్, మంద భాస్కర్, కడెం వెంకటేష్, కడెం అశోక్, భూషపాక మల్లేష్, చిన్నగల్ల లింగస్వామి, దేశం శ్రీకాంత్, చిన్నగల్ల లక్ష్మీనారాయణ, చిన్నగల్ల గణేష్, బొడ్డు శివబాబు, సంధిగారి చందు, మునిగళ్ళ మల్లేష్, కుర్మిండ్ల భాను, మునిగళ్ళ కృష్ణ, శివగల శివ, మంద ఆనంద్, ముల్గారం ముఖేష్, బండమీద భరత్, శివగల గౌతమ్, బత్తుల నవదీప్ తదితరులు పాల్గొన్నారు.
#Ambedkar #Gnanamala #MRPS #BBNagar #SocialAwareness #TelanganaNews
Follow us on
Website
Facebook
Instagram
YouTube