37 ఏళ్ల ఉపాధ్యాయ సేవలకు వీడ్కోలు.. మచ్చా శ్రీనివాస్కు ఘన సన్మానం
ఎన్టీఆర్ జిల్లా, తిరువూరు: తిరువూరు మండలంలోని చిట్టెల, గానుగపాడు, కోకిలంపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో 37 ఏళ్ల పాటు జీవశాస్త్ర ఉపాధ్యాయుడిగా సేవలందించిన మచ్చా శ్రీనివాస్ పదవీ విరమణ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల సిబ్బంది ఆధ్వర్యంలో ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు.
కార్యక్రమానికి హాజరైన తిరువూరు నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇంచార్జ్ నల్లగట్ల స్వామిదాస్, సతీమణి సుధారాణి దంపతులు మచ్చా శ్రీనివాస్, సతీమణి ఉషారాణిని శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థుల భవిష్యత్కు పునాది వేసిన ఉపాధ్యాయుడిగా మచ్చా శ్రీనివాస్ సేవలు చిరస్మరణీయమని కొనియాడారు.
37 ఏళ్ల సుదీర్ఘ ఉపాధ్యాయ జీవితంలో వేలాది మంది విద్యార్థులకు విద్యాబోధనతో పాటు విలువలు, క్రమశిక్షణను అలవర్చిన శ్రీనివాస్ సేవలను పలువురు ప్రశంసించారు. పదవీ విరమణ అనంతరం కూడా సమాజానికి తన అనుభవంతో సేవలందించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో యరదేసి రామారావు, పాపారావు తదితరులు పాల్గొని మచ్చా శ్రీనివాస్కు పదవీ విరమణ శుభాకాంక్షలు తెలిపారు.