649 సర్వే నెంబర్ భూమిపై పూర్తి స్థాయిలో రీ-సర్వే
649 సర్వే నెంబర్ భూమిపై పూర్తి స్థాయిలో రీ-సర్వే
చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని సర్వే నెంబర్ 649 లో వివాదాస్పదంగా మారిన 1 ఎకరం 1 గుంట భూమిపై పూర్తి సర్వే చేయించి అట్టి భూమిని పరిరక్షిస్తామని తాసిల్దార్ ఎం. విజయకుమార్ అన్నారు. సోమవారం పట్టణ కేంద్రంలోని 649 సర్వేనెంబర్ లో ఉన్న 1ఎకరం 1 గుంట భూమిని ఆయన సందర్శించారు. అనంతరం ఆయన అట్టి భూమికి సంబంధించిన యజమానులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2002లో టిటిడి కి విక్రయిస్తున్నట్లు భూ యజమానులు చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం ఇప్పటికి కట్టుబడి ఉన్నామని దానిప్రకారమే మేము మునిసిప్పాలిటికి ఎప్పుడంటే అప్పుడే రిజిస్ట్రేషన్ చేయాడానికి సిద్దంగా ఉన్నామని వారు తెలిపారన్నారు. మీడియాలో వచ్చిన వార్త కథనాలను పరిశీలనలోకి తీసుకొని తాము ఇట్టి భూమిని రీ సర్వే చేయించి 1 ఎకరం 1 గుంట భూమి రిజిస్ట్రేషన్ జరిగేలా చూస్తామని ఆయన తెలిపారు..
ఆయనతోపాటు ఎస్సై ఎం.రవికుమార్, ఆర్ఐ జానీ షరీఫ్, జిపిఓ రెహమాన్ తదితరులు పాల్గొన్నారు..