BREAKING
మున్సిపల్ ట్రాక్టర్ల నిర్లక్ష్యం రోడ్లపైనే రాలుతున్న చెత్త.. మంత్రి పార్థసారధి కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన టీడీపీ సీనియర్ నేత బొట్టు లక్ష్మణరావు మంత్రి పార్థసారధి కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన యువనేత చాగంటి రాధాకృష్ణ ఒక రోడ్డు ప్రమాదం మూడు కుటుంబాల్లో విషాదం బీర్ల ఐలయ్యపై అనుచిత వ్యాఖ్యలు జిల్లా ప్రజలకు వాతావరణ హెచ్చరిక ఏలూరు-జంగారెడ్డిగూడెం ప్రధాన రహదారి నిర్మాణపు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి పునర్విభజన - మహిళా రిజర్వేషన్ బిల్లుపై సిపిఐ ఎంఎల్ లిబరేషన్ విమర్శలు శంఖంపల్లి గ్రామంలో విషాదం.. విద్యుత్ షాక్‌తో యువకుడు మృతి జలధార పనులు నాణ్యతతో పూర్తి చేయాలి: కలెక్టర్ మున్సిపల్ ట్రాక్టర్ల నిర్లక్ష్యం రోడ్లపైనే రాలుతున్న చెత్త.. మంత్రి పార్థసారధి కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన టీడీపీ సీనియర్ నేత బొట్టు లక్ష్మణరావు మంత్రి పార్థసారధి కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన యువనేత చాగంటి రాధాకృష్ణ ఒక రోడ్డు ప్రమాదం మూడు కుటుంబాల్లో విషాదం బీర్ల ఐలయ్యపై అనుచిత వ్యాఖ్యలు జిల్లా ప్రజలకు వాతావరణ హెచ్చరిక ఏలూరు-జంగారెడ్డిగూడెం ప్రధాన రహదారి నిర్మాణపు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి పునర్విభజన - మహిళా రిజర్వేషన్ బిల్లుపై సిపిఐ ఎంఎల్ లిబరేషన్ విమర్శలు శంఖంపల్లి గ్రామంలో విషాదం.. విద్యుత్ షాక్‌తో యువకుడు మృతి జలధార పనులు నాణ్యతతో పూర్తి చేయాలి: కలెక్టర్
www.ntodaynews.com

తెలంగాణ పోలీసుల చారిత్రాత్మక నిర్ణయం

తెలంగాణ
21 Jan, 2026 - 09:37 PM
229 వీక్షణలు
బాధితులకు ఊరట: ఘటనా స్థలంలోనే ఎఫ్‌ఐఆర్‌ తెలంగాణ పోలీసుల చారిత్రాత్మక నిర్ణయం NTODAY NEWS: హైదరాబాద్ హైదరాబాద్‌లో ‘సిటిజన్ సెంట్రిక్’ విధానం అమలు నేర బాధితులకు సత్వర న్యాయం అందించడమే లక్ష్యంగా తెలంగాణ పోలీస్ శాఖ మరో కీలక సంస్కరణకు శ్రీకారం చుట్టింది. బాధితులు పోలీస్ స్టేషన్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండా, నేరం జరిగిన స్థలంలోనే ఎఫ్‌ఐఆర్ నమోదు చేసే ‘విక్టిమ్/సిటిజన్ సెంట్రిక్’ విధానాన్ని హైదరాబాద్‌లో అమలు చేస్తున్నట్లు నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ తెలిపారు. బంజారాహిల్స్‌లోని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (TGICCC)లో నిర్వహించిన అవగాహన సమావేశంలో ఆయన ఈ విధానం వివరించారు. పోలీసులే బాధితుల వద్దకు నేరం జరిగిన తర్వాత బాధితులు శారీరకంగా, మానసికంగా ఆందోళనలో ఉంటారని, అటువంటి సమయంలో స్టేషన్‌కు రావడం భారంగా మారుతుందని తెలిపారు. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని తెలంగాణ సీఐడీ ఈ కొత్త విధానాన్ని రూపొందించిందన్నారు. ఏ కేసుల్లో స్పాట్ ఎఫ్‌ఐఆర్ -ఆత్మహత్యలు -అసహజ మరణాలు -రోడ్డు ప్రమాదాలు -చోరీలు, దోపిడీలు -వాహన దొంగతనాలు -మహిళలు, పిల్లలపై నేరాలు -ర్యాగింగ్ కేసులు ఈ కేసుల్లో పోలీసులు నేరుగా బాధితుల వద్దకు వెళ్లి ఫిర్యాదు స్వీకరిస్తారు. ఆసుపత్రిలో ఉన్నా కేసు నమోదు బాధితులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నా, పోలీసులు అక్కడికే వెళ్లి వివరాలు సేకరించి తక్షణమే ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తారని స్పష్టం చేశారు. నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు ఈ విధానం అమలులో అలసత్వం వహించిన పోలీసులపై శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. బాధితులను అనవసరంగా స్టేషన్‌కు రప్పించినా, కేసు నమోదులో జాప్యం చేసినా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రతి కేసును ఏసీపీ, డీసీపీ స్థాయి అధికారులు పర్యవేక్షిస్తారని చెప్పారు. ఫిర్యాదు నమోదు కాకపోతే ఈ విధానం ప్రకారం ఎఫ్‌ఐఆర్ నమోదు చేయకపోతే, బాధితులు హైదరాబాద్ సిటీ పోలీస్ అధికారిక వాట్సాప్ నంబర్ 94906 16555 కు వివరాలు పంపాలని సూచించారు. సైబర్ నేర బాధితుల కోసం ప్రారంభించిన ‘సి-మిత్ర’ తరహాలోనే, ఈ విధానం కూడా ప్రజలకు రక్షణగా నిలుస్తుందని తెలిపారు. ఈ విధానాన్ని రూపొందించిన డీజీపీ బి. శివధర్ రెడ్డి, సీఐడీ అదనపు డీజీపీ చారు సిన్హాలకు కృతజ్ఞతలు తెలిపారు. #TelanganaPolice #CitizenCentricPolicing #SpotFIR #HyderabadPolice #PoliceReforms #VictimSupport #PublicSafety #LawAndOrder #TGPolice #JusticeForAll Follow us on Website Facebook Instagram YouTube