www.ntodaynews.com
జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకువచ్చిన నాయకుడు
తెలంగాణ
స్పీకర్ పదవికి జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకువచ్చిన నాయకుడు శ్రీపాదరావు: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
NTODAY NEWS: గొల్లపల్లి ప్రతినిధి లక్ష్మణ్
89వ జయంతి వేడుకల్లో ఘన నివాళులు
ధర్మపురి, మార్చి 2: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్గా సేవలందించి ఆ పదవికి దేశవ్యాప్తంగా గుర్తింపు తీసుకువచ్చిన నాయకుడు స్వర్గీయ శ్రీపాదరావు అని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీపాదరావు 89వ జయంతి కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు.
ఘన నివాళులు
మొదట శ్రీపాదరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన రాజకీయ ప్రస్థానాన్ని గుర్తు చేస్తూ, సాధారణ కుటుంబంలో జన్మించి తన కృషి, నిబద్ధతతో ఉమ్మడి రాష్ట్ర శాసనసభ స్పీకర్ స్థాయికి ఎదిగారని పేర్కొన్నారు.
ప్రజాస్వామ్య విలువలకు ప్రాధాన్యం
స్పీకర్గా ఉన్న సమయంలో అధికార, ప్రతిపక్షాలకు సమాన ప్రాధాన్యతనిస్తూ సభను హుందాగా నడిపారని కొనియాడారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ కార్యకర్తలకు అండగా నిలిచిన నాయకుడని గుర్తుచేశారు.
మంత్రి శ్రీధర్ బాబు రాజకీయాల్లో కొనసాగుతున్న విషయాన్ని ప్రస్తావిస్తూ, తనలాంటి కార్యకర్తలకు అవకాశాలు కల్పించడంలో ఆయన పాత్ర ముఖ్యమని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సంఘనభట్ల దినేష్, మున్సిపల్ చైర్మన్ వేముల నాగలక్ష్మి, వైస్ చైర్మన్ ఇందారం రామన్న, కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
#Sripadarao #Dharmapuri #CongressParty #PoliticalTribute #TelanganaNews
Follow us on
Website
Facebook
Instagram
YouTube