BREAKING
10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
www.ntodaynews.com

ఆగివున్న లారీని ఢీకొట్టిన మినీ బస్సు .. ఒకరు మృతి, 13 మందికి గాయాలు!

తెలంగాణ
/ నల్గొండ / నార్కెట్ పల్లి
Reporter
కూనురు మధు నల్గొండ జిల్లా ప్రతినిధి
03 Jun, 2026 - 11:07 AM
245 వీక్షణలు

నల్లగొండ జిల్లా అద్దంకి - నార్కెట్‌పల్లి రహదారిపై బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నార్కెట్‌పల్లి శివారులో రోడ్డు పక్కన ఆగివున్న డీసీఎం వాహనాన్ని ఒక మినీ ట్రావెల్ బస్సు వేగంగా వచ్చి వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. ​అరుణాచలం నుంచి వస్తుండగా ప్రమాదం

 స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. క్షతగాత్రులంతా తమిళనాడులోని అరుణాచలం క్షేత్రాన్ని దర్శించుకుని తిరిగి హైదరాబాద్‌ వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. మినీ బస్సు నార్కెట్‌పల్లి శివారుకు చేరుకోగానే, డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో రోడ్డు పక్కన ఆగి ఉన్న డీసీఎంను బలంగా ఢీకొట్టింది. ఢీకొట్టిన వేగానికి మినీ బస్సు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయింది. ప్రమాద సమయంలో బస్సులో ఉన్న ప్రయాణికుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతమంతా భయానకంగా మారింది. ​ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, వాహనదారులు స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. ​ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను వెంటనే చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు ​గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.​ ​ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని, ప్రమాదానికి గల పూర్తి కారణాలపై దర్యాప్తు జరుపుతున్నారు.