BREAKING
ఎల్కతుర్తిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం లబ్ధిదారులకు పెన్షన్లు అందచేసిన కమిషనర్ NHAI అధికారులతో కేంద్ర మంత్రి పెమ్మసాని సమీక్ష కశిoకోట RECS పాలిటెక్నిక్ కళశాల టీచర్లు రేలే నిరాహార దీక్ష సెప్టెంబర్ 1.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చరిత్రలో చిరస్మరణీయమైన రోజు కాగిత రామచంద్రపురం గ్రామ ప్రభుత్వ ఉపాధ్యాయుడికి హానరరీ డాక్టర్ ప్రధానం వాహనాలు తనిఖీలు జరిమానా విధింపు 2టౌన్ ఎస్సై గా బాధ్యతలు స్వీకరణ 30 ఏళ్ల కల సాకారం.. వెలిగొండ ప్రాజెక్ట్‌కు జాతికి అంకితం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీవై పార్టీ పోటీ.. ఎల్కతుర్తిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం లబ్ధిదారులకు పెన్షన్లు అందచేసిన కమిషనర్ NHAI అధికారులతో కేంద్ర మంత్రి పెమ్మసాని సమీక్ష కశిoకోట RECS పాలిటెక్నిక్ కళశాల టీచర్లు రేలే నిరాహార దీక్ష సెప్టెంబర్ 1.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చరిత్రలో చిరస్మరణీయమైన రోజు కాగిత రామచంద్రపురం గ్రామ ప్రభుత్వ ఉపాధ్యాయుడికి హానరరీ డాక్టర్ ప్రధానం వాహనాలు తనిఖీలు జరిమానా విధింపు 2టౌన్ ఎస్సై గా బాధ్యతలు స్వీకరణ 30 ఏళ్ల కల సాకారం.. వెలిగొండ ప్రాజెక్ట్‌కు జాతికి అంకితం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీవై పార్టీ పోటీ..
Date of Publish : 03 June 2026, 11:07 am
Posted by : కూనురు మధు

ఆగివున్న లారీని ఢీకొట్టిన మినీ బస్సు .. ఒకరు మృతి, 13 మందికి గాయాలు!

తెలంగాణ
/ నల్గొండ / నార్కెట్ పల్లి
03 Jun, 2026 - 11:07 AM
351 వీక్షణలు

నల్లగొండ జిల్లా అద్దంకి - నార్కెట్‌పల్లి రహదారిపై బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నార్కెట్‌పల్లి శివారులో రోడ్డు పక్కన ఆగివున్న డీసీఎం వాహనాన్ని ఒక మినీ ట్రావెల్ బస్సు వేగంగా వచ్చి వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. ​అరుణాచలం నుంచి వస్తుండగా ప్రమాదం

 స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. క్షతగాత్రులంతా తమిళనాడులోని అరుణాచలం క్షేత్రాన్ని దర్శించుకుని తిరిగి హైదరాబాద్‌ వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. మినీ బస్సు నార్కెట్‌పల్లి శివారుకు చేరుకోగానే, డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో రోడ్డు పక్కన ఆగి ఉన్న డీసీఎంను బలంగా ఢీకొట్టింది. ఢీకొట్టిన వేగానికి మినీ బస్సు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయింది. ప్రమాద సమయంలో బస్సులో ఉన్న ప్రయాణికుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతమంతా భయానకంగా మారింది. ​ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, వాహనదారులు స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. ​ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను వెంటనే చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు ​గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.​ ​ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని, ప్రమాదానికి గల పూర్తి కారణాలపై దర్యాప్తు జరుపుతున్నారు.