BREAKING
బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద 300 మందికి అన్నదానం.. రెడీ టూ సర్వ్ ఫౌండేషన్ సేవా బాలల ఆరోగ్యకర ఎదుగుదలకు పౌష్టికాహారమే పునాది: సర్పంచ్ కట్టగూరి సురేందర్ రెడ్డి పేదలకు తక్కువ ధరల్లో డయాగ్నోస్టిక్ సేవలు అందిస్తామని ప్రకటన విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద 300 మందికి అన్నదానం.. రెడీ టూ సర్వ్ ఫౌండేషన్ సేవా బాలల ఆరోగ్యకర ఎదుగుదలకు పౌష్టికాహారమే పునాది: సర్పంచ్ కట్టగూరి సురేందర్ రెడ్డి పేదలకు తక్కువ ధరల్లో డయాగ్నోస్టిక్ సేవలు అందిస్తామని ప్రకటన విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు.
www.ntodaynews.com

ఆగస్టు 3 నుంచి రైల్వే గ్రూప్-డి పరీక్షలు

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
26 Jul, 2026 - 03:08 PM
20 వీక్షణలు

రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (ఆర్ఆర్బీ) ఆధ్వర్యంలో 22,195 గ్రూప్-డి పోస్టుల భర్తీకి నిర్వహించనున్న కంప్యూటర్ ఆధారిత పరీక్షలు (సీబీటీ) ఆగస్టు 3 నుంచి 21 వరకు జరగనున్నాయి. ఈ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల కోసం పరీక్ష నగర సమాచారం (సిటీ ఇంటిమేషన్ స్లిప్)ను ఆర్ఆర్బీ అందుబాటులోకి తీసుకొచ్చింది.

అభ్యర్థులు తమ నమోదు వివరాలతో అధికారిక వెబ్‌సైట్‌లో లాగిన్ అయి పరీక్ష తేదీ, షిఫ్ట్, పరీక్ష జరిగే నగరం వంటి వివరాలను తెలుసుకోవచ్చు. అయితే ఈ స్లిప్‌లో పరీక్ష కేంద్రం పూర్తి చిరునామా ఉండదు. ఆ వివరాలు పరీక్షకు నాలుగు రోజుల ముందు విడుదల చేసే అడ్మిట్ కార్డులో మాత్రమే ఉంటాయి.

పరీక్ష రోజున అడ్మిట్ కార్డుతో పాటు చెల్లుబాటు అయ్యే ఫొటో గుర్తింపు కార్డును తప్పనిసరిగా తీసుకెళ్లాలని అధికారులు సూచించారు. అలాగే పరీక్షకు సంబంధించిన అన్ని తాజా ప్రకటనలు, అడ్మిట్ కార్డు విడుదల వంటి వివరాల కోసం అభ్యర్థులు ఆర్ఆర్బీ అధికారిక వెబ్‌సైట్‌ను ఎప్పటికప్పుడు పరిశీలించాలని సూచించారు.