BREAKING
వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం పటాన్‌చెరులో గంజాయిపై పోలీసుల ఉక్కుపాదం విద్యార్థులకు ఉచిత నోట్‌బుక్స్ పంపిణీ – హెల్త్ క్యాంపు కరవు పనులు చేస్తూ కూలీ మృతి పొదుపు సంఘం కమిటీ ఆధ్వర్యంలో ఆర్థిక సాయం అందజేత. ఏలికట్టేలో ఘనంగా కంఠమహేశ్వర స్వామి బోనాల పండుగ బస్తీలలో పర్యటించిన చార్మినార్ జోనల్ కమిషనర్ సత్యనారాయణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసిన కండాల సమరం రెడ్డి గుంటూరులో 66 వాహనాలకు సెప్టెంబర్ 26న వేలం రావులపాలెంలో వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం పటాన్‌చెరులో గంజాయిపై పోలీసుల ఉక్కుపాదం విద్యార్థులకు ఉచిత నోట్‌బుక్స్ పంపిణీ – హెల్త్ క్యాంపు కరవు పనులు చేస్తూ కూలీ మృతి పొదుపు సంఘం కమిటీ ఆధ్వర్యంలో ఆర్థిక సాయం అందజేత. ఏలికట్టేలో ఘనంగా కంఠమహేశ్వర స్వామి బోనాల పండుగ బస్తీలలో పర్యటించిన చార్మినార్ జోనల్ కమిషనర్ సత్యనారాయణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసిన కండాల సమరం రెడ్డి గుంటూరులో 66 వాహనాలకు సెప్టెంబర్ 26న వేలం రావులపాలెంలో వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం
Date of Publish : 09 September 2026, 07:35 pm
Posted by : SEETHA KIRAN KUMAR

బలమైన 6G నెట్‌వర్క్‌ కోసం 24 దేశాలతో భారత్ భాగస్వామ్యం

జాతీయం జాతీయం
Reporter
Seetha Kiran Kumar Hanmakonda Mandal
09 Sep, 2026 - 07:35 PM
6 వీక్షణలు

గ్లోబల్ 6G ప్రమాణాల్లో కనీసం 10 శాతం వాటా లక్ష్యం

న్యూఢిల్లీ | Ntoday News

ప్రపంచంలో అత్యంత బలమైన 6G నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేసేందుకు భారత్ మరో 24 అభివృద్ధి చెందిన దేశాలతో కలిసి పనిచేయనున్నట్లు కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా వెల్లడించారు. ఈ విషయాన్ని ఆయన ‘ఎక్స్‌’ వేదికగా తెలిపారు.

గ్లోబల్ 6G ప్రమాణాల రూపకల్పనలో భారత్ కీలక పాత్ర పోషించడంతో పాటు, కనీసం 10 శాతం వాటాను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. 6G సాంకేతికత అభివృద్ధి, ప్రమాణాల రూపకల్పనలో అంతర్జాతీయ సహకారాన్ని మరింత బలోపేతం చేయనున్నట్లు పేర్కొన్నారు.

G20 ఇన్నోవేషన్ వేదికపై భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించిన మంత్రి జితిన్‌కు జ్యోతిరాదిత్య సింధియా ధన్యవాదాలు తెలిపారు. 6G సాంకేతికతపై ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు, అభివృద్ధి వేగం పుంజుకుంటున్న నేపథ్యంలో భారత్ కూడా ఈ రంగంలో తన సామర్థ్యాన్ని పెంచుకుంటోంది.

2030 నాటికి 6G సాంకేతికత పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని మంత్రి పేర్కొన్నారు. 5G తర్వాత మరింత వేగవంతమైన, తక్కువ లేటెన్సీతో కూడిన కనెక్టివిటీని అందించడమే 6G లక్ష్యంగా ఉండనుంది.