ఆగస్టు 6 నుండి ఉచిత యోగ శిక్షణా తరగతులు
ఆగస్టు 6 నుండి ఉచిత యోగ శిక్షణా తరగతులు
చిట్యాల లో ఆగస్టు 6వ తేదీ నుండి సంకల్ప క్రియ యోగ ఉచిత శిక్షణా తరగతులు నిర్వహించబడునని సంకల్ప క్రియా సాధకులు బూరుగు కృష్ణయ్య, కంచర్ల ఈశ్వరయ్య,కాచం రమేష్ తెలిపారు. చిట్యాల లోని ధ్యాన మందిరం లో మంగళవారం జరిగిన సమావేశంలో వారు మాట్లాడారు. యోగాసనాలతో అనారోగ్యా సమస్యలు తొలగి మార్పులతో ఆరోగ్యం మెరుగుపడుతుందన్నారు. స్థానిక భువనగిరి రోడ్ లోని లక్ష్మి గార్డెన్స్ ఫంక్షన్ హాల్ 6 వ తేది సాయంకాలం 6గంటలకు పరిచయ కార్యక్రమం తో శిక్షణ తరగతులు ప్రారంభం కానున్నాయాన్నారు, మరుసటి రోజు నుండి ఉదయం 5 గంటల నుండి 7 వరకు, సాయంకాలం 6 గంటల నుండి 8 గంటల వరకు ఉచిత యోగ శిక్షణ జరునని తెలిపారు. శిక్షణ కు ప్రతి ఒక్కరు హాజరై ఆరోగ్యావంతులుగా కావడం, ఆరోగ్యం ను మెరుగుపరచుకోవాలన్నారు. కార్యక్రమం లో రేగొండ వేణుమాధవ్, మాస శ్రీనివాస్, గాదె ఎల్లేష్, నీలా సత్యనారాయణ, పోలా సరోజ సాధకులు పాల్గొన్నారు.*