BREAKING
thumb గర్భిణీపై దాడి కేసులో భర్తకు 6 నెలల జైలు శిక్ష thumb వైఎస్ అంజిలి రెడ్డి వివాహంపై షర్మిల కీలక ప్రకటన thumb అక్టోబర్ 1 నుంచి జనన, మరణ నమోదు కొత్త నిబంధనలు thumb చిట్యాలలో గణనాథునికి ప్రత్యేక పూజలు thumb నూతన గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే అత్తార్ చాంద్ బాషా thumb ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ thumb అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యల ఆరోపణలు.. thumb మోదుగులపల్లి టీడీపీ నేతకు నారా లోకేష్ ప్రశంసా పత్రం thumb శారదా కాలనీలో తాపీ మేస్త్రి మృతి thumb గణేష్ నిమజ్జనంలో యువకుడు గల్లంతు thumb గర్భిణీపై దాడి కేసులో భర్తకు 6 నెలల జైలు శిక్ష thumb వైఎస్ అంజిలి రెడ్డి వివాహంపై షర్మిల కీలక ప్రకటన thumb అక్టోబర్ 1 నుంచి జనన, మరణ నమోదు కొత్త నిబంధనలు thumb చిట్యాలలో గణనాథునికి ప్రత్యేక పూజలు thumb నూతన గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే అత్తార్ చాంద్ బాషా thumb ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ thumb అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యల ఆరోపణలు.. thumb మోదుగులపల్లి టీడీపీ నేతకు నారా లోకేష్ ప్రశంసా పత్రం thumb శారదా కాలనీలో తాపీ మేస్త్రి మృతి thumb గణేష్ నిమజ్జనంలో యువకుడు గల్లంతు
Date of Publish : 18 September 2026, 09:14 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

వానాకాలం సాగులో 94 శాతం పూర్తి.. 1.24 కోట్ల ఎకరాల్లో పంటలు

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
18 Sep, 2026 - 09:14 PM
4 వీక్షణలు

హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా వానాకాలం పంటల సాగు 94 శాతానికి చేరింది. సాధారణ సాగు విస్తీర్ణం 1.32 కోట్ల ఎకరాలు కాగా, బుధవారం నాటికి 1 కోటి 24 లక్షల 90 వేల ఎకరాల్లో రైతులు పంటలు సాగు చేసినట్లు వ్యవసాయశాఖ తాజా నివేదికలో వెల్లడించింది. రాష్ట్రంలోని 10 జిల్లాల్లో సాధారణ సాగు విస్తీర్ణాన్ని మించి పంటలు సాగు కాగా, మరో 10 జిల్లాల్లో 90 శాతానికి పైగా సాగు నమోదైంది.

ఈ వానాకాలంలో వరి అత్యధికంగా 55.89 లక్షల ఎకరాల్లో సాగైంది. ఆ తర్వాత పత్తి 48.32 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. ఈ రెండు పంటల విస్తీర్ణమే 1.04 కోట్ల ఎకరాలు కావడం గమనార్హం. మక్కజొన్న 5.93 లక్షల ఎకరాలు, కంది 5.57 లక్షల ఎకరాలు, సోయాబీన్ 3.72 లక్షల ఎకరాల్లో సాగయ్యాయి. ఈ మూడు పంటలు కలిపి 15.22 లక్షల ఎకరాల్లో సాగయ్యాయి.

వికారాబాద్ జిల్లాలో 1.11 లక్షల ఎకరాల్లో రైతులు కంది సాగు చేశారు. మిగిలిన విస్తీర్ణంలో పెసలు, వేరుశనగ, మినుములు, జొన్న, సజ్జ, చెరకు తదితర పంటలు సాగయ్యాయి. ఎల్‌నినో పరిస్థితులు ఉన్నప్పటికీ రాష్ట్రంలో 94 శాతం సాగు నమోదు కావడం వ్యవసాయశాఖ నివేదికలో ప్రత్యేకంగా పేర్కొంది. గతేడాది ఇదే సమయానికి 1.32 కోట్ల ఎకరాల్లో సాగు జరగగా, ఈసారి 7.41 లక్షల ఎకరాల మేర సాగు తగ్గింది.

10 జిల్లాల్లో వంద శాతానికి పైగా సాగు

ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, మెదక్, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, మేడ్చల్ జిల్లాల్లో సాధారణ సాగు విస్తీర్ణానికి సమానంగా లేదా అంతకుమించి పంటలు సాగైనట్లు వ్యవసాయశాఖ తెలిపింది.

మొత్తం సాగు విస్తీర్ణం పరంగా నల్గొండ జిల్లా ముందంజలో ఉంది. జిల్లాలో 9.91 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. సంగారెడ్డిలో 7.05 లక్షల ఎకరాలు, ఆదిలాబాద్‌లో 5.88 లక్షల ఎకరాలు, నిజామాబాద్‌లో 5.48 లక్షల ఎకరాలు, వికారాబాద్‌లో 5.35 లక్షల ఎకరాలు, సిద్ధిపేటలో 5.05 లక్షల ఎకరాలు, ఖమ్మంలో 5.03 లక్షల ఎకరాల్లో సాగు నమోదైంది.

వరిలో నిజామాబాద్.. పత్తిలో నల్గొండ

వరి సాగులో నిజామాబాద్ జిల్లా ముందుంది. అక్కడ 4.36 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. నల్గొండలో 3.60 లక్షల ఎకరాలు, సూర్యాపేటలో 3.45 లక్షల ఎకరాలు, సిద్ధిపేటలో 3.16 లక్షల ఎకరాలు, జగిత్యాలలో 3 లక్షల ఎకరాల్లో వరి సాగు నమోదైంది.

పత్తి సాగులో నల్గొండ జిల్లా 5.93 లక్షల ఎకరాలతో ముందుంది. ఆదిలాబాద్‌లో 4.37 లక్షల ఎకరాలు, కుమురం భీం ఆసిఫాబాద్‌లో 3.77 లక్షల ఎకరాలు, సంగారెడ్డిలో 3.57 లక్షల ఎకరాల్లో పత్తి సాగైనట్లు వ్యవసాయశాఖ నివేదికలో పేర్కొంది.