ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాల హెచ్చరిక.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
ఒడిశా వైపు నుంచి ప్రభావం చూపుతున్న ఉరుములు, మెరుపులతో కూడిన వర్ష మేఘాల కారణంగా ఆంధ్రప్రదేశ్లోని ఉత్తర కోస్తా నుంచి దక్షిణ కోస్తా వరకు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
ముఖ్యంగా విశాఖపట్నం, కాకినాడ, అమలాపురం, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, తిరుపతి ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
ఇప్పటికే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈదురుగాలులు, వర్షాల ప్రభావం కనిపిస్తోంది. కొన్ని ప్రాంతాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలిన ఘటనలు నమోదవడంతో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ప్రజలకు సూచనలు
అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకండి.
ఉరుములు, మెరుపుల సమయంలో చెట్ల కింద నిలబడవద్దు.
విద్యుత్ స్తంభాలు, తెగిపోయిన వైర్లకు దూరంగా ఉండండి.
వర్షాలకు ముందుగానే అవసరమైన జాగ్రత్తలు తీసుకోండి.
స్థానిక అధికారులు, విపత్తు నిర్వహణ శాఖ సూచనలను తప్పనిసరిగా పాటించండి.
వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.