BREAKING
యోగాంధ్ర కార్యక్రమాల విజయవంత నిర్వహణకు శ్రీశైలం దేవస్థానం ప్రణాళిక బీటెక్ విద్యార్థి కిడ్నాప్ కలకలం.. చివరకు పల్నాడు జిల్లా నరసరావుపేటలో భారీ చోరీ. హోంమంత్రిపై తప్పుడు వ్యాఖ్యలు చేయడం తగదు: ఆగివున్న లారీని ఢీకొట్టిన మినీ బస్సు .. ఒకరు మృతి, 13 మందికి గాయాలు! మార్కాపురంలో రేషన్ బియ్యం మాఫియాకు భారీ షాక్.. 1922 కేజీల బియ్యం సీజ్! అంగరంగ వైభవంగా జన్మదిన వేడుకలు.... ట్రాక్టర్లకు రేడియం స్టిక్కర్లు.. రహదారి ప్రమాదాల నివారణకు నూజివీడు పోలీసుల ప్రత్యేక చర్య పుంగనూరులో తల్లిపై కుమారుడి కర్రలతో దాడి పల్లె నిద్రలో ప్రజలతో మమేకమైన ఆగిరిపల్లి పోలీసులు యోగాంధ్ర కార్యక్రమాల విజయవంత నిర్వహణకు శ్రీశైలం దేవస్థానం ప్రణాళిక బీటెక్ విద్యార్థి కిడ్నాప్ కలకలం.. చివరకు పల్నాడు జిల్లా నరసరావుపేటలో భారీ చోరీ. హోంమంత్రిపై తప్పుడు వ్యాఖ్యలు చేయడం తగదు: ఆగివున్న లారీని ఢీకొట్టిన మినీ బస్సు .. ఒకరు మృతి, 13 మందికి గాయాలు! మార్కాపురంలో రేషన్ బియ్యం మాఫియాకు భారీ షాక్.. 1922 కేజీల బియ్యం సీజ్! అంగరంగ వైభవంగా జన్మదిన వేడుకలు.... ట్రాక్టర్లకు రేడియం స్టిక్కర్లు.. రహదారి ప్రమాదాల నివారణకు నూజివీడు పోలీసుల ప్రత్యేక చర్య పుంగనూరులో తల్లిపై కుమారుడి కర్రలతో దాడి పల్లె నిద్రలో ప్రజలతో మమేకమైన ఆగిరిపల్లి పోలీసులు
www.ntodaynews.com

​ఆటో డ్రైవర్ల హామీలను నెరవేర్చాలి: కలెక్టర్‌కు హింద్ మజ్దూర్ సభ వినతి

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజకవర్గ ప్రతినిధి
03 Jun, 2026 - 03:29 PM
33 వీక్షణలు

రెండేళ్లయినా అమలుకు నోచుకోని ఎన్నికల వాగ్దానాలు

ఉచిత బస్సులతో దెబ్బతిన్న జీవనోపాధి: HMS జిల్లా అధ్యక్షుడు నరెడ్ల శ్రీనివాస్

రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని హింద్ మజ్దూర్ సభ మంచిర్యాల జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. బుధవారం హింద్ మజ్దూర్ సభ ఆటో డ్రైవర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఆటో కార్మికుల సమస్యల పరిష్కారం, సంక్షేమ బోర్డు ఏర్పాటు కోరుతూ జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా హింద్ మజ్దూర్ సభ జిల్లా అధ్యక్షులు నరెడ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి రెండున్నర సంవత్సరాలు గడుస్తున్నా ఆటో కార్మికులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చకపోవడం విచారకరమన్నారు. ఎన్నికల వేళ ప్రకటించిన విధంగా ప్రతి ఆటో డ్రైవర్‌కు ఏడాదికి రూ. 12,000 ఆర్థిక సహాయం అందించాలని, ఆటో నగర్‌ల ఏర్పాటుతో పాటు అర్హులైన డ్రైవర్లకు ఇంటి స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేశారు.

​ప్రస్తుతం రాష్ట్రంలో అమలువుతున్న ఉచిత బస్సు పథకం కారణంగా ఆటోలకు గిరాకీ గణనీయంగా తగ్గిపోయి ఆటో డ్రైవర్ల జీవనోపాధి పూర్తిగా దెబ్బతిన్నదని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి తోడు నిరంతరం పెరుగుతున్న ఇంధన ధరలు, వాహనాల నిర్వహణ ఖర్చులు, బ్యాంకు ఈఎంఐల భారం తోడై ఆటో డ్రైవర్లు తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. జిల్లాలో వేలాది కుటుంబాలు కేవలం ఆటో వృత్తి పైనే ఆధారపడి బతుకుతున్నాయని, ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి ఆటో కార్మికులకు గుర్తింపు కార్డులు, ప్రమాద మరియు ఆరోగ్య బీమా, పిల్లల చదువులకు విద్యా సహాయం, వృద్ధాప్య పింఛన్లతో పాటు తక్కువ వడ్డీకే బ్యాంక్ రుణాలు అందించి ఆదుకోవాలని కోరారు.

​ఈ కార్యక్రమంలో హింద్ మజ్దూర్ సభ ఆటో డ్రైవర్స్ యూనియన్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఎండి షఫీ, జిల్లా ప్రధాన కార్యదర్శి తగురం శ్రీనివాస్, హింద్ మజ్దూర్ సభ జిల్లా నాయకులు కర్ణకంటి రవీందర్, సీనియర్ నాయకులు కలవాలా అంజన్న పాల్గొన్నారు. వారితో పాటు ఆటో డ్రైవర్లు పల్లపు శ్రీనివాస్, చల్లా సురేష్, అనంతుల మహేష్, రాజుగారి మహేష్, తాజ్ బాబా, సంతు, స్టాలిన్, మహేందర్, సాయి, మహేష్ తదితరులు పాల్గొన్నారు