www.ntodaynews.com
ACB ట్రాప్లో షాక్..! బొల్లారంలో ఏఈ రెడ్హ్యాండెడ్ అరెస్ట్
తెలంగాణ
సంగారెడ్డి జిల్లా బొల్లారం ప్రాంతంలో టీజీఎస్పీడీసీఎల్ ఐడీఏ కార్యాలయంలో పని చేస్తున్న అదనపు సహాయ ఇంజనీర్ (ఓపీ) బి. రామకృష్ణ రెడ్డి లంచం వ్యవహారంలో ఏసీబీకి చిక్కి సంచలనం సృష్టించారు.
విద్యుత్ సంబంధిత పనికి రూ.25,000 లంచం డిమాండ్ చేసి, డబ్బు స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులు సడన్గా దాడి చేసి రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. కార్యాలయం సమీపంలో జరిగిన ఈ ఆపరేషన్తో అక్కడ ఒక్కసారిగా కలకలం రేగింది. అధికార వర్గాల్లో ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది.