BREAKING
పర్వతాపురంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ ద్రావిడ విశ్వవిద్యాయంలో డిప్లమా ఇన్ యోగా కోర్స్ పరీక్ష ప్రారంభం ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం చిట్యాల మార్కెట్ కమిటీలో ఘనంగా స్వాగత – వీడ్కోలు కార్యక్రమం పుంగనూరు MRO కార్యాలయం వద్ద నిరసన బీబీనగర్ గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సంబరాలు. జాతీయ జెండాను ఆవిష్కరించిన భువనగిరి మాజీ మార్కెట్ డైరెక్టర్ భువనగిరి సదానందం గౌడ్ ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరణ. తహసీల్దార్ కార్యాలయంలో సిమెంట్ బస్తాలు చోరీ చాట్రాయిలో మహిళల భద్రతపై అవగాహన సదస్సు పర్వతాపురంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ ద్రావిడ విశ్వవిద్యాయంలో డిప్లమా ఇన్ యోగా కోర్స్ పరీక్ష ప్రారంభం ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం చిట్యాల మార్కెట్ కమిటీలో ఘనంగా స్వాగత – వీడ్కోలు కార్యక్రమం పుంగనూరు MRO కార్యాలయం వద్ద నిరసన బీబీనగర్ గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సంబరాలు. జాతీయ జెండాను ఆవిష్కరించిన భువనగిరి మాజీ మార్కెట్ డైరెక్టర్ భువనగిరి సదానందం గౌడ్ ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరణ. తహసీల్దార్ కార్యాలయంలో సిమెంట్ బస్తాలు చోరీ చాట్రాయిలో మహిళల భద్రతపై అవగాహన సదస్సు
www.ntodaynews.com

ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలి

తెలంగాణ
17 Feb, 2026 - 11:18 AM
171 వీక్షణలు
రబీ వరి ధాన్యం కొనుగోళ్లకు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలి: అదనపు కలెక్టర్ భాస్కరరావు NTODAY NEWS: యాదాద్రి భువనగిరి జిల్లా రబీ 2025-26 వరి ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి సంబంధిత అధికారులు సమగ్ర ముందస్తు ప్రణాళికలు రూపొందించి, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కరరావు ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో ధాన్యం సేకరణలో పాల్గొనే శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కొనుగోలు కేంద్రాల్లో టోకెన్ విధానం అమలు చేసి ధాన్యం సేకరణను సాఫీగా నిర్వహించాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల ఏర్పాటు సమయంలో ఎత్తు, పల్లాలు సరిచూసుకుని సరైన ప్రదేశాలను ఎంపిక చేయాలని తెలిపారు. కేంద్రాల్లో అవసరమైన మౌలిక వసతులు—వేయింగ్ మెషీన్లు, ఆటోమేటిక్ ప్యాడీ క్లీనర్లు, టార్పాలిన్ షీట్లు, గన్నీ బ్యాగులు—సరిపడా సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. ప్రతి కొనుగోలు కేంద్రానికి కనీసం 50 టార్పాలిన్ షీట్లు అందుబాటులో ఉండాలని పేర్కొన్నారు. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని రైతులు, నిర్వాహకులు, సిబ్బందికి తాగునీరు, నీడ, షెడ్లు, టెంట్లు, కుర్చీలు వంటి సదుపాయాలు కల్పించాలని సూచించారు. ఏవైనా సమస్యలు తలెత్తితే వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని అన్నారు. అలాగే అన్ని PPC కేంద్రాలు ఈ నెలాఖరులోగా PCSAP పోర్టల్‌లో సంబంధిత వివరాలు నమోదు చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి నాగిరెడ్డి, జిల్లా పౌరసరఫరాల అధికారి రోజారాణి, పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ హరికృష్ణ, జిల్లా వ్యవసాయ అధికారి రమణారెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు. #PaddyProcurement #RabiSeason #YadadriBhuvanagiri #FarmersWelfare #AgricultureNews #TelanganaNews Follow us on Website Facebook Instagram YouTube