www.ntodaynews.com
ఏఎస్ఐ రమేష్ నడుపుతున్న కారు ఢీకొని యువకుడు మృతి
ఆంధ్రప్రదేశ్
/
పల్నాడు
ఏఎస్ఐ రమేష్ నడుపుతున్న కారు ఢీకొని యువకుడు మృతి
చిలకలూరిపేట పట్టణంలోని ఎన్నార్టీ సెంటర్ వద్ద రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న యువకుడు మృతి చెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని పాత పశువుల సంత ప్రాంతంలో నివాసముంటున్న వీసా సురేష్ కేటరింగ్ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఎన్నార్టీ సెంటర్ సామ్రాట్ హోటల్ వైపు నుంచి ఇంటికి నడుచుకుంటూ వెళుతున్నాడు. అదే సమయంలో సొంత కారు నడుపుకుంటూ వెళుతున్న చిలకలూరిపేట రూరల్ ఏఎస్ఐ రమేష్ సురేష్ ను ఢీకొట్టాడు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సురేష్ను గుంటూరులోని జిజిహెచ్ లో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. కుటుంబానికి ఆధారంగా ఉన్న కుమారుడు మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు గా విలపిస్తున్నారు.